Revanth Reddy : దుర్మార్గం ఖాకీల‌ తీరు దారుణం – రేవంత్

పీఎం..సీఎం దిష్టిబొమ్మ‌లు ద‌గ్ధం చేయాలి

Revanth Reddy : శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై ఖాకీలు అనుస‌రించిన తీరు అత్యంత దారుణంగా ఉంద‌ని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

తాము ప‌వ‌ర్ లోకి రాగానే ఒక్కొక్క‌రిని గుర్తు పెట్టుకుని బ‌దులు తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో గురువారం చేప‌ట్టిన ఛ‌లో రాజ్ భ‌వ‌న్ కార్య‌క్ర‌మం ఉద్రిక్త‌త‌కు దారి తీసింది.

ప‌లువురిని అరెస్ట్ చేశారు. మ‌రో వైపు రేణుకా చౌద‌రిని అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మ‌హిళా నాయ‌కురాలి ప‌ట్ల పురుష పోలీసులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చిందో చెప్పాల‌న్నారు.

హైద‌రాబాద్ న‌డిబొడ్డున మైన‌ర్ బాలిక రేప్ జ‌రిగితే మైన‌ర్ల‌కు బిర్యానీ ఇస్తున్నార‌ని, కానీ న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన వారిపై లాఠీలు ఎలా ఝులిపిస్తారా అని నిల‌దీశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

బొల్లారం పోలీస్ స్టేష‌న్ నుండి విడుద‌లైన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఫామ్ హౌస్ లో ప‌డుకుంటున్న సీఎంకు పాల‌న సాగించే తీరే లేకుండా పోయింద‌న్నారు.

ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నా ఈరోజు వ‌ర‌కు స్పందించిన పాపాన పోలేద‌ని ధ్వ‌జ‌మెత్తారు. తాము ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టామ‌ని ఎక్క‌డా దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు.

ఖాకీలు అనుస‌రించిన ప‌ద్ద‌తి దారుణంగా ఉంద‌న్నారు. ఇలాంటిది ఎక్క‌డా చూడ‌లేద‌న్నారు. ఆనాడు తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన వారిని కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్ కు పిల‌వ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు.

రేపు ల‌గ‌డ‌పాటి రాజ గోపాల్ ను కూడా పిలుస్తారేమోన‌ని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).

Also Read : అమ్మ కోసం విచార‌ణ‌కు రాలేను – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!