7 Terrorists Killed : క‌శ్మీర్ లో ఏడుగురు ఉగ్ర‌వాదులు హ‌తం

మూడు వేర్వేరు ఎన్ కౌంట‌ర్ల‌లో ఘ‌ట‌న

7 Terrorists Killed : క‌శ్మీర్ లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో జ‌రిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 7 మంది టెర్ర‌రిస్టులు(7 Terrorists Killed) హ‌త‌మ‌య్యారు. లోయ‌తో పాటు కొన్ని ప్రాంతాల్లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఈ విష‌యాన్ని క‌శ్మీర్ లోని ఇన్ స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ విజ‌య్ కుమార్ వెల్ల‌డించారు. తీవ్ర‌వాద కార్య‌క‌లాయాల‌పై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. లోయ‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టామ‌ని ఇందులో భాగంగానే ఉగ్ర‌వాదుల ఏరివేత కార్య‌క్రమం కొన‌సాగుతుంద‌న్నారు.

కాశ్మీర్ లో శాంతి నెల‌కొల్పేందుకు భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను టెర్రరిస్టులు అడ్డుకోలేర‌ని హెచ్చ‌రించారు. గ‌త 24 గంట‌ల్లో జ‌రిగిన మూడు వేర్వేరు ఎన్ కౌంట‌ర్ల‌లో ఏడుగురిని క్లోజ చేశామ‌న్నారు పోలీసులు.

కుప్వారా జిల్లాలోని లోలాబ్ ప్రాంతంలో జ‌రిగిన ఎన్ కౌంట‌ర్ లో అరెస్ట్ అయిన ఉగ్ర‌వాద అనుమానితుడితో పాటు న‌లుగురు టెర్ర‌రిస్టులు హ‌త‌మైన‌ట్లు చెప్పారు.

జూన్ 2న పేలుడులో ప్ర‌మేయం ఉన్నందుకు మ‌రో నిందితుడితో పాటు అరెస్ట్ యిన పోషియాన్ జిల్లాలోని సెడో గ్రామానికి చెందిన షోక‌త్ అహ్మ‌ద్ షేక్ వివ‌రాలు వెల్ల‌డించార‌ని తెలిపారు.

ఆ వివ‌రాల ఆధారంగా తాము తీవ్ర‌వాద వ్య‌తిరేక ఆప‌రేష‌న్ ప్రారంభిమ‌చామ‌ని చెప్పారు విజ‌య్ కుమార్. ర‌హ‌స్య స్థావ‌రం కోసం జ‌రిగిన సెర్చింగ్ లో దాగి ఉన్న ఉగ్ర‌వాదులు జాయింట్ సెర్చ్ పార్టీపై కాల్పులు జ‌రిపార‌ని తెలిపారు.

అనంత‌రం అది ఎన్ కౌంట‌ర్ కు దారి తీసింద‌న్నారు. కుల్దామ్ లో జ‌రిగిన మ‌రో ఎన్ కౌంట‌ర్ లో జైషే మ‌హ్మ‌ద్ కు చెందిన ఇద్ద‌రు స్థానిక రిక్రూట్ లు హ‌తమైన‌ట్లు చెప్పారు విజ‌య్ కుమార్.

Also Read : సాయుధ ద‌ళాల చీఫ్ లు వివ‌ర‌ణ ఇస్తారా

Leave A Reply

Your Email Id will not be published!