Priyanka Gandhi : కాంగ్రెస్ కార్య‌క‌ర్తకు లిఫ్ట్ ఇచ్చిన ప్రియాంక

సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ ..వైర‌ల్

Priyanka Gandhi : కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi)  మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె పార్టీ కార్య‌క‌ర్త‌ల ప‌ట్ల ఎంత అభిమానంగా ఉంటార‌నేది ఇవాళ జ‌రిగిన సంఘ‌ట‌న గుర్తు చేసింది.

ప్రియాంక గాంధీ ఎక్క‌డికి వెళ్లినా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను పరామర్శిస్తారు. వారి కుటుంబాల‌కు భ‌రోసా కూడా ఇస్తారు. తాజాగా సోమ‌వారం త‌న సోద‌రుడు రాహుల్ గాంధీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆఫీసుకు నాలుగో రోజు విచార‌ణ‌కు హాజ‌రయ్యారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చాయి. ఇదిలా ఉండ‌గా ఇదే స‌మ‌యంలో ఓ కార్య‌క‌ర్త రాహుల్ గాంధీకి వీరాభిమాని. న‌డుచుకుంటూ రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తు తెలిపేందుకు బ‌య‌లు దేరాడు. అత‌డిని పోలీసులు అడ్డుకున్నారు.

అదే ర‌హ‌దారిపై వెళుతున్న స‌డెన్ గా ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆపారు. వెంట‌నే స‌ద‌రు కార్య‌క‌ర్త‌ను అడ్డుకోవ‌ద్దంటూ కోరారు. కార్య‌క‌ర్త‌ను త‌న వాహ‌నంలో ఎక్కించుకుని ఈడీ ఆఫీస్ వ‌ద్ద‌కు చేరుకున్నారు.

దీంతో నాయ‌కురాలు అంటే ఇలా ఉండాల‌ని, ఎలాంటి భేష‌జాలు లేకుండా సాధార‌ణ కార్య‌క‌ర్త‌ల‌ను స్వంతింటి మ‌నుషులుగా చూసే మ‌న‌స్త‌త్వం ప్రియాంక గాంధీకి ఉండ‌డం గ్రేట్ అంటున్నారు ఆ పార్టీకి చెందిన నాయ‌కులు , కార్యక‌ర్త‌లు.

కాగా కార్య‌క‌ర్త‌ను ఎక్కించుకున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వైర‌ల్ గా మారాయి.

అగ్నిప‌థ్ స్కీంకు వ్య‌తిరేకంగా, ఈడీ వేధింపుల‌కు నిర‌సిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఇక స‌త్యాగ్ర‌హ్ దీక్ష కూడా చేప‌ట్టారు.

Also Read : కీల‌క ప‌ద‌వుల ఎంపికపై కాంగ్రెస్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!