Sanjay Raut : ‘రాడిస‌న్ బ్లూ’ కాద‌ది బిగ్ బాస్ హౌస్ – రౌత్

శివ‌సేన స్పోక్స్ ప‌ర్స‌న్ సంజ‌య్ షాకింగ్ కామెంట్స్

Sanjay Raut : మ‌హారాష్ట్ర సంక్షోభాన్ని సాధ్య‌మైనంత వ‌ర‌కు ముగించేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు శివ‌సేన పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి, రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ రౌత్(Sanjay Raut) .

మొత్తం ఆయ‌నే సెంట‌ర్ పాయింట్ గా మారారు. ఎక్క‌డా తగ్గ‌డం లేదు. మ‌రో వైపు రెబ‌ల్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూనే త‌ప్పు ఒప్పుకుంటే స్వాగ‌తిస్తామ‌ని ఆఫ‌ర్ కూడా ఇప్ప‌టికే ఇచ్చేశారు.

అయినా రెబ‌ల్స్ మెట్టు దిగ‌డం లేదు. రోజు రోజుకు నెంబ‌ర్ గేమ్ మారుతోంది. మొత్తం వ్య‌వ‌హారం ఇప్పుడు డిప్యూటీ స్పీక‌ర్ చేతిలో ఉంది. 16 మంది ఎమ్మెల్యేల‌కు అన‌ర్హ‌త నోటీసులు జారీ చేశారు.

సోమవారం 5 గంట‌ల లోపు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అందులో పేర్కొన్నారు. ఈ త‌రుణంలో ఆదివారం సంజ‌య్ రౌత్(Sanjay Raut)  మీడియాతో మాట్లాడారు.

ధిక్కార స్వ‌రం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు అస్సాంలోని గౌహ‌తి రాడిస‌న్ బ్లూ హొట‌ల్ లో మ‌కాం వేశారు. వాళ్లు రోజుకు రూ. 8 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తున్నారు.

దాన్ని ప‌క్క‌న పెడితే అది హొట‌ల్ లాగా లేదు ప్ర‌స్తుతం మోస్ట్ పాపుల‌ర్ షోగా పేరొందిన బిగ్ బాస్ హౌస్ లాగా ఉంద‌ని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు సంజ‌య్ రౌత్. బాలా సాహెబ్ ఠాక్రేకు ద్రోహం చేసిన వాళ్లు అయి పోయారు.

ఆ 40 మంది ఎమ్మెల్యేల కెరీర్ ఖ‌తం అయి పోయిన‌ట్లేన‌ని జోస్యం చెప్పారు. వారంతా బ‌తికి ఉన్నా లేన‌ట్టేన‌ని పేర్కొన్నారు. పోస్టు మార్టం ప్ర‌జ‌లే చేస్తారని చెప్పారు సంజ‌య్ రౌత్.

ఆ హోట‌ల్ లో తాగుతున్నారు. తింటున్నారు. ఆడుకుంటున్నారు. అందులోంచి స‌గం మంది ఎలిమినేట్ కావ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌

Leave A Reply

Your Email Id will not be published!