AP CM YS Jagan : ప్ర‌శ్నిస్తా అన్న ద‌త్త‌పుత్రుడు ఎక్క‌డ

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై నిప్పులు చెరిగిన జ‌గ‌న్

AP CM YS Jagan : తూర్పు గోదావ‌రి జిల్లా నిడుద‌వోలు లో జ‌రిగిన కాపు నేస్తం కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి(AP CM YS Jagan) నిప్పులు చెరిగారు. ఆర్థిక నేర‌స్థుడు చంద్ర‌బాబు నాయుడు అంటూ ఆరోపించారు. దోచుకున్న ఆ దొంగ‌ను ఎలా ర‌క్షిస్తార‌ని అనుకుంటున్నారంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌శ్నిస్తా, నిల‌దీస్తా అంటూ బీరాలు పలికిన ద‌త్త పుత్రుడు జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు నిల‌దీయ‌డం లేద‌ని నిల‌దీశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

AP CM YS Jagan Comments on Pawan Kalyan

ములాఖ‌త్ పేరుతో మిలాఖ‌త్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. 45 ఏళ్లుగా దోపిడీనే రాజ‌కీయంగా మార్చుకున్నాడ‌ని చంద్ర‌బాబు నాయుడుపై ఫైర్ అయ్యారు జ‌గ‌న్ . ప‌క్కా ఆధారాల‌తో అరెస్ట్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. బాబు గ‌జ‌దొంగ అని ఈ దొంగ‌ల ముఠా ఎందుకు స‌పోర్ట్ చేస్తుందో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

ఎంత‌గా ప్ర‌య‌త్నం చేసినా బ‌య‌ట‌కు వ‌చ్చే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఈ దొంగ‌ల ముఠా స‌భ్యులకు ఇదే శిక్ష త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ల‌ను ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు జ‌గ‌న్ రెడ్డి.

ఇంత జ‌రిగినా ఇంకా ఎల్లో మీడియా స‌పోర్ట్ చేస్తూ ఉండ‌డం దారుణ‌మ‌న్నారు. ఎందుక‌ని నిజాల‌ను దాస్తున్నారంటూ ప్ర‌శ్నించారు. ఇక‌నైనా త‌మ తీరును మార్చు కోవాల‌ని లేక పోతే ఊరుకునే ప్ర‌సక్తి లేద‌న్నారు.

Also Read : Nara Lokesh : ఐటీ ఉద్యోగుల‌కు లోకేష్ థ్యాంక్స్

Leave A Reply

Your Email Id will not be published!