Baba Ramdev : ఇస్లాం ఉగ్ర‌వాదానికి ఊతం – రామ్ దేవ్

ఇస్లాం..క్రైస్త‌వం రెండూ ఒక్క‌టే

Baba Ramdev : యోగా గురు రామ్ దేవ్ బాబా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌త మార్పిడుల విష‌యంలో ఇస్లాం, క్రైస్త‌వ మ‌తాలు ఒక్క‌టేన‌ని ఆరోపించారు. న‌మాజ్ వ‌ల్ల ఉగ్ర‌వాదం, హిందూ బాలిక‌ల అప‌హ‌ర‌ణ నుంచి విముక్తి ల‌భిస్తుంద‌ని ముస్లింలు భావిస్తున్నారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌జ‌ల్ని త‌మ మ‌తాల్లోకి మార్చుకునే విష‌యంలో ఒకే ప‌ద్దతిని అనుస‌రిస్తున్నాయంటూ ఆరోపించారు రామ్ దేవ్ బాబా(Baba Ramdev). రాజస్థాన్ లోని బార్మ‌ర్ లో జ‌రిగిన మ‌త ప‌ర‌మైన సమావేశంలో రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

ఇందులో రామ్ దేవ్ బాబా ముస్లింలు ఉగ్ర‌వాద చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హిందూ మ‌హిళ‌ల‌ను అప‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్త‌వ మ‌తాలు త‌మ త‌మ మ‌తాల‌లోకి ప్ర‌జ‌ల‌ను మార్పిడి చేయ‌డం అనే ఏకైక ఎజెండాతో ప‌ని చేస్తున్నాయ‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎవ‌రినీ విమ‌ర్శించ‌డం లేదు.

కానీ కొంత మంది ప్ర‌పంచాన్ని ఇస్లాం, క్రైస్త‌వ మ‌తంలోకి మార్చేందుకు నిమ‌గ్న‌మై ఉన్నార‌ని మండిప‌డ్డారు రామ్ దేవ్ బాబా(Baba Ramdev). ముస్లింలు రోజుకు ఐదుసార్లు న‌మాజ్ అందించడం వ‌ల్ల ఉగ్ర‌వాదం ,నేరం వ‌టి అన్ని ర‌కాల పాపాలు తొల‌గి పోతాయ‌ని అనుకుంటున్నార‌ని ఆరోపించారు. క్రైస్త‌వులు కూడా చ‌ర్చిల‌లో కొవ్వొత్తి వెలిగించ‌డం ద్వారా త‌మ పాపాల‌న‌ను పోగొట్టుకుంటార‌ని కానీ హిందూ మ‌తంలో అలాంటిది ఏమీ లేద‌న్నారు రామ్ దేవ్ బాబా.

బాబా చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమంటున్నాయి ఇస్లాం, క్రైస్త‌వ సంఘాలు.

Also Read : స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాలు ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!