Revanth Reddy : తుఫాను ప్రభావం అప్రమత్తత అవసరం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy : హైదరాబాద్ – బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ ఎత్తున వర్సాలు కురుస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలు నీళ్ల పాలయ్యాయి. వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీంతో రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరా తీశారు.
Revanth Reddy Comment about Cyclone
ప్రస్తుతం పార్టీ హై కమాండ్ ఆదేశాల మేరకు ఆయన ఢిల్లీకి వెళ్లారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. తుపాను తీవ్రత పెరగడంతో ఆయా జిల్లాలలో రైతులకు, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు రేవంత్ రెడ్డి.
ఏజెన్సీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. వీలైతే ఆయా జిల్లాల్లో టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని సీఎస్ కు సూచించారు.
Also Read : Seethakka : అన్నకు చెల్లెలు అభినందన