Vivek Venkata Swamy : బీజేపీకి షాక్ వివేక్ రాజీనామా

రాహుల్ గాంధీని క‌లిసిన నేత

Vivek Venkata Swamy: హైద‌రాబాద్ – తెలంగాణ‌లో ఎన్నిక‌ల వేళ భార‌తీయ జ‌న‌తా పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆ పార్టీ మేనిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ గ‌డ్డం వివేక్(Gaddam Vivek) త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే ఆయ‌న హైద‌రాబాద్ లోని నోవా టెల్ హోటల్ లో ఉన్న ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీని క‌లిశారు. త‌న‌తో పాటు త‌న‌యుడుతో క‌లిసి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నారు.

Vivek Venkata Swamy Joined in Congress

గ‌డ్డం వెంక‌ట స్వామి కుటుంబం అనాది నుంచి కాంగ్రెస్ పార్టీతో కొన‌సాగుతూ వ‌చ్చింది. గ‌తంలో ఎంపీగా ఓట‌మి పాల‌య్యారు. అనంత‌రం కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ప్ర‌స్తుతం ఊహించ‌ని రీతిలో త‌న‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేద‌ని ఆవేద‌న చెందారు. ఆ వెంట‌నే పార్టీకి గుడ్ బై చెప్పారు.

బుధ‌వారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, జ‌గ్గా రెడ్డితో క‌లిసి స్వ‌యంగా తానే రాహుల్ వ‌ద్ద‌కు వెళ్లారు. త‌న‌కు టికెట్ ముఖ్యం కాద‌ని, కేవ‌లం రాష్ట్రంలో కొలువు తీరిన కేసీఆర్ స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా పోరాడ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మ‌న్నారు. గ‌తంలో ఆయ‌న బీఆర్ఎస్ లో ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో జంప్ అయిన వివేక్ మ‌రోసారి త‌న స్వంత గూటికి చేరుకోవ‌డం విస్తు పోయేలా చేసింది.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించారు వివేక్. ఆయ‌న సార‌థ్యంలోని మీడియా పెద్ద ఎత్తున స‌పోర్ట్ గా నిలిచింది.

Also Read : Akkineni Nagarjuna : కేసీఆర్ స‌ర్కార్ కు నాగ్ కితాబు

Leave A Reply

Your Email Id will not be published!