K Surendran Modi : ప్ర‌ధానికి సురేంద్ర‌న్ అరుదైన గిఫ్ట్

మోదీని క‌లిసిన కేర‌ళ బీజేపీ చీఫ్

K Surendran Modi : కేర‌ళ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ కె. సురేంద్ర‌న్ శుక్ర‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని మ‌ర్యాద పూర్వ‌కంగా కలిశారు. పీఎంకు అద్భుత‌మైన గిఫ్ట్ ల‌ను కూడా అంద‌జేశారు. ప్ర‌తిమ‌తో పాటు కండువాను క‌ప్పారు న‌రేంద్ర మోదీకి. ఈ సంద‌ర్బంగా కె. సురేంద్ర‌న్ ప్ర‌ధాన‌మంత్రితో అర‌గంట‌కు పైగా చ‌ర్చించారు. కేర‌ళ‌లో రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి పీఎంకు వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో పార్టీ సంస్థాగ‌త కార్య‌క‌లాపాల పురోగతిని మోదీ అడిగి తెలుసుకున్నారు.

ప్ర‌ధాన‌మంత్రిని ఆయ‌న నివాసంలో క‌లుసుకున్న అనంత‌రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు కేర‌ళ బీజేపీ స్టేట్ చీఫ్ కె. సురేంద్ర‌న్. న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో(K Surendran Modi), విలువైన సూచ‌న‌లు స‌ల‌హాల‌తో తాము ముందుకు వెళ‌తామ‌ని అన్నారు. ప్ర‌ధాని ముందు చూపు దేశానికి చాలా అవ‌స‌ర‌మ‌న్నారు. ఆయ‌న విలువైన మార్గ‌ద‌ర్శ‌క‌త్వం కేర‌ళ‌లో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు కె. సురేంద్ర‌న్.

కేర‌ళ‌లో ఎల్డీఎఫ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా బీజేపీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేప‌ట్టింది. బీజేపీకి నాయ‌క‌త్వం వ‌హిస్తున‌న కె. సురేంద్ర‌న్(K Surendran Modi) మ‌రింత దూకుడు పెంచారు. బీజేపీ స్టేట్ చీఫ్ కు దిశా నిర్దేశం చేశారు పీఎం మోదీ. ఎట్టి ప‌రిస్థితుల్లో ఉపేక్షించ వ‌ద్ద‌ని స‌ర్కార్ ను ఎండ‌గ‌ట్టాల‌ని బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

గ్రామ స్థాయి నుంచి ప‌ట్ట‌ణ వ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ జెండా రెప రెప లాడాల‌ని పిలుపునిచ్చారు. ఇదే క్ర‌మంలో పార్టీని మ‌రింత ముందుకు తీసుకు వెళ్ల‌డంలో చేస్తున్న కృషిని అభినందించారు.

Also Read : ఆప్ కౌన్సిల‌ర్ బీజేపీలోకి జంప్

Leave A Reply

Your Email Id will not be published!