KTR : కేసీఆర్ రైతుల కోసం దీక్షలో…సీఎం ఐపీల్ లోనా…

ఈ దీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ...రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని అన్నారు...

KTR : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి విజయం సాధించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ చైర్మన్ కేటీఆర్ అన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష కు పిలుపునిచ్చింది.

KTR Slams Revanth Reddy

ఈ దీక్షలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ…రేవంత్ ప్రభుత్వం దున్నపోతుతో సమానమని అన్నారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వాలని అడిగితే ఎన్నికల చట్టం ఉందన్నారు. సీరియస్ గా ఉంటే ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలి. మేము కూడా లేఖ పంపిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలో రెండు స్థంభాలను బాగు చేస్తే తెలంగాణలో ఇక కరువు ఉండదన్నారు. ప్రజలపై ప్రేమ ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఎర్రటి ఎండలో, ప్రతిపక్ష నేత కెసిఆర్ ప్రజల్లో తిరిగితే. రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్‌లు చూస్తున్నారంటూ ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి అని, ప్రధాని తాపీ మేస్త్రి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read : Rajnath Singh: ఉగ్రవాదులకు రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్‌ !

Leave A Reply

Your Email Id will not be published!