Niranjan Reddy : స్వామినాథ‌న్ తో నిరంజ‌న్ రెడ్డి భేటీ

తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ సాగుపై చ‌ర్చ‌

Niranjan Reddy : తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నీళ్ల నిరంజ‌న్ రెడ్డి బుధ‌వారం త‌మిళ‌నాడుకు వెళ్లారు. అక్క‌డ దేశంలోనే పేరు పొందిన వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త ప్రొఫెస‌ర్ ఎంఎస్ స్వామి నాథ‌న్ తో భేటీ అయ్యారు. మంత్రితో పాటు వ్య‌వ‌సాయ కార్య‌ద‌ర్శి ర‌ఘునందన్ రావు, టీఎస్ సీడ్స్ ఎండీ కేశ‌వులు ఉన్నారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ‌లో వ్య‌వ‌సాయ రంగ అభివృద్ది కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్బంగా ఎంఎస్ స్వామినాథ‌న్ కు వివ‌రించారు.

Niranjan Reddy Meet

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్దిని ప్ర‌త్య‌క్షంగా చూసి తెలుసు కునేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌ర్చార‌ని తెలిపారు నిరంజ‌న్ రెడ్డి(Niranjan Reddy). రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగే దిశ‌గా చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించామ‌ని పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఇవాళ వ్య‌వ‌సాయం దండుగ కాదు పండుగగా మార్చ‌డం జ‌రిగంద‌ని, ఈ క్రెడిట్ అంతా త‌మ నాయ‌కుడు, సీఎం కేసీఆర్ వ‌ల్ల చోటు చేసుకుంద‌న్నారు. ఇవాళ చేప‌ట్టిన ప్రాజెక్టుల నిర్మాణం వ‌ల్ల దేశంలోనే తెలంగాణ ధాన్యాగారంగా మారింద‌ని తెలిపారు నిరంజ‌న్ రెడ్డి. అంతే కాదు సీడ్ బౌల్ గా త‌యారు చేశామ‌న్నారు. ఇవాళ తాము తీసుకు వ‌చ్చిన రైతు బంధు దేశానికి ఆదర్శంగా మారింద‌న్నారు. త‌మ ప్రోగ్రామ్ ను కేంద్రం కాపీ కొట్టింద‌న్నారు నిరంజ‌న్ రెడ్డి.

Also Read : Daggubati Purandeswari : పోటీ విష‌యం పార్టీ నిర్ణ‌యం

Leave A Reply

Your Email Id will not be published!