Rishab Panth Re-entry : రిషబ్ పంత్ హెల్త్ పై కీలక ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ..

డిసెంబర్ 2022లో, ఢిల్లీ నుండి జార్ఖండ్‌లోని తన స్వస్థలం రూర్కీకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అతని కారు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదానికి గురైంది

Rishab Panth : IPL 2024 ప్రారంభానికి ముందు, డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్ మరియు వికెట్ కీపర్ రిషబ్ పంత్ అభిమానులకు శుభవార్త వచ్చింది. రిషబ్ పంత్ ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. “డిసెంబర్ 30, 2022 న ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ 14 నెలల సుదీర్ఘ పునరావాసం మరియు కోలుకునే ప్రక్రియ తర్వాత మళ్లీ ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము.” “బ్యాట్స్‌మెన్ ఆరోగ్యంగా ఉన్నాడు,” అని బీసీసీఐ(BCCI) X వేదికగా తెలిపింది. దీంతో పంత్ ఐపీఎల్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. దీంతో 2024 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ నాయకత్వం వహించనున్నాడు.

Rishab Panth Re-Entry

డిసెంబర్ 2022లో, ఢిల్లీ నుండి జార్ఖండ్‌లోని తన స్వస్థలం రూర్కీకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, అతని కారు ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేలో ప్రమాదానికి గురైంది. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అతని మోకాలికి మేజర్ సర్జరీ జరిగింది. అయితే ఈ ప్రమాదం కారణంగా పంత్(Rishab Pant) 14 నెలల పాటు క్రికెట్‌కు విరామం ఇవ్వాల్సి వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని వారాల క్రితం, అతను వికెట్ కీపింగ్, బ్యాటింగ్, రన్నింగ్, వార్మప్ మరియు నైపుణ్య శిక్షణతో సహా అన్ని విభాగాలలో శిక్షణను ప్రారంభించాడు. చాలా ఫిట్‌నెస్ వ్యాయామాలు కూడా చేశాడు. పూర్తి పరీక్షల అనంతరం ఆరోగ్యంగా ఉన్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పంత్ చేరిక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సానుకూల పరిణామం. 2023 ఐపీఎల్ సీజన్‌లో టీమ్ బ్యాటింగ్‌ పరంగా ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే.

Also Read : LPG Price Discount : సామాన్య మానవుడికి మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్

Leave A Reply

Your Email Id will not be published!