Vijay Sai Reddy : ఐటీ ఉద్యోగులు కాదు పెయిడ్ ఆర్టిస్టులు
ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్
Vijay Sai Reddy : వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఆర్థిక నైపుణ్య నేరస్తుడు చంద్రబాబు నాయుడుకు జైలు తప్పదన్నారు. ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికి పోయాడని, ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నా శిక్ష పడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు ఎంపీ.
Vijay Sai Reddy Cmments on IT Employees
ఇదిలా ఉండగా తాజాగా నారా లోకేష్ ట్వీట్ చేస్తూ హైదరాబాద్, బెంగళూరులలోని ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు తన తండ్రి చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఆందోళనకు దిగారంటూ ఫోటోలు షేర్ చేశారు. వారికి థ్యాంక్స్ కూడా తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వీటిపై వైస్సార్సీపీ పార్టీతో పాటు ఎంపీ విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy) స్పందించారు. వీళ్లు ఐటీ ఉద్యోగులు లాగా లేరని కేవలం తెలుగుదేశం పార్టీ పంపించిన పెయిడ్ ఆర్టిస్టులు లాగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు చంద్రబాబు నాయుడు శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందేనంటూ స్పష్టం చేశారు ఎంపీ విజయ సాయి రెడ్డి.
ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. మరోవైపు ఏపీ సీఎం జగన్ రెడ్డి ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ను గజ దొంగ అంటూ మండిపడ్డారు. ఈ దొంగను దొంగల ముఠా కాపాడేందుకు ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
Also Read : Karthik Rao : నీల్సన్ సిఇవోగా కార్తీక్ రావు