Virat Anushka Rishi Kesh : రిషికేశ్ ఆశ్ర‌మంలో విరాట్..అనుష్క‌

కూతురు వామిక‌తో క‌లిసి ఆశీర్వాదం

Virat Anushka Rishi Kesh : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , స్పీడ్ గ‌న్ గా పేరొందిన విరాట్ కోహ్లీకి ఆట‌తో పాటు భ‌క్తి కూడా ఎక్కువే. ఎక్క‌డా ఓట‌మిని ఒప్పుకోనీ ఈ క్రికెట‌ర్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే.

ఏరికోరి అనుష్క శ‌ర్మ‌ను పెళ్లి చేసుకున్నాడు ఈ బ్యాట‌ర్. వీరికి ఓ ముద్దుల కూతురు కూడా ఉంది. ఆ పాప పేరు వామిక‌. ఆ పాప పేరుతో ఓ చారిటీ సంస్థ‌ను ఇటీవ‌లే ఏర్పాటు చేశాడు. ఏ మాత్రం స‌మ‌యం చిక్కినా వెంట‌నే ఏదైనా ఆశ్ర‌మానికో వెళుతుంటారు విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మ‌.

కూతురు వామిక అంటే ఆ ఇద్ద‌రికీ పంచ ప్రాణం. ఆ పాప‌ను విడిచి ఒక్క క్ష‌ణం కూడా ఉండ‌లేడు కోహ్లీ. ఆట కంటే ఎక్కువ‌గా ప్రేమిస్తాడు. మెషీన్ గ‌న్ త‌న కూతురు వామిక‌, భార్య అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి భార‌త దేశంలో అత్య‌ధికంగా పేరొందిన ఆశ్ర‌మాల‌ను సంద‌ర్శించ‌డం ఆన‌వాయితీ. 

తాజాగా రిషి కేశ్ ఆశ్ర‌మాన్ని(Virat Anushka Rishi Kesh) సంద‌ర్శించారు. స్వామి వారి ఆశీస్సులు పొందారు ఈ జంట‌. ఆశ్ర‌మంలో భండారా అంటే మ‌త విందు ఏర్పాటు చేస్తారు.

స్వదేశంలో ఆస్ట్రేలియాతో భార‌త్ వ‌న్డే, టెస్టు సీరీస్ ఆడ‌నుంది. విరాట్, అనుష్క దంప‌తులు స్వామి ద‌యానంద్ గిరి ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. అనుష్క‌, విరాట్ ఆశ్ర‌మంలో పూజ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆశ్ర‌మంలో బ‌హిరంగ మ‌త ప‌ర‌మైన ఆచారాల‌లో పాల్గొంటార‌ని ఆపై భండారా నిర్వహిస్తార‌ని స‌మాచారం.

Also Read : ఆడ‌బిడ్డ‌ల విజ‌యం చోప్రా స‌లాం

Leave A Reply

Your Email Id will not be published!