MP Nandigam Suresh: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ పై పోటీకు దిగుతున్న వాలంటీర్‌ !

వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ పై పోటీకు దిగుతున్న వాలంటీర్‌ !

MP Nandigam Suresh: బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్‌ పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్‌బాబు అనే వాలంటీర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్‌ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఐదేళ్లలో ఎంపీ సురేశ్‌ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఎంపీ సురేశ్ అరాచకాల్ని భరించలేకే పోటీకి దిగినట్లు ఆనంద్‌బాబు తెలిపారు.

MP Nandigam Suresh Compitation

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడిపే సురేశ్‌… బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ఆయన ప్రశ్నించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధికోసం ఉద్దండరాయునిపాలెంలోని ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : YS Sharmila: మంత్రి బొత్సపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !

Leave A Reply

Your Email Id will not be published!