K Annamalai : తమిళనాట పార్లమెంట్ ఎన్నికల్లో అన్నామలై ఫార్ములా ఫలించేనా..!

మిళనాడులో పొత్తు లేకుండా బీజేపీ 19 స్థానాల్లో పోటీ చేస్తోంది....

K Annamalai : ద్రవిడ పార్టీలకు కంచుకోట అయిన తమిళనాడులో లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన ఫలితాన్ని అందిస్తుందా? రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K Annamalai) నేతృత్వంలో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందా? ఇండియా టీవీ-సిఎన్ఎక్స్ నిర్వహించిన పోల్ ప్రకారం, ఓటు “అనుకూలంగా” ఉంది. ఏప్రిల్ 19న తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో బీజేపీకి సానుకూల ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

K Annamalai…

తమిళనాడులో పొత్తు లేకుండా బీజేపీ 19 స్థానాల్లో పోటీ చేస్తోంది. కోయంబత్తూరు నుంచి అన్నామలై పోటీ చేస్తున్నారు. ఈసారి బీజేపీకి అనూహ్యమైన ఫలితాలు వచ్చినప్పటికీ త్రిముఖ పోటీ (డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే, బీజేపీ)లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి తెరపైకి వస్తుందని సర్వే తేల్చింది. బీజేపీ ఒంటరిగా నాలుగు సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆరు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.

అనేక ప్రజా సమస్యలపై శ్రీ అన్నామలై అధికార పక్షాన్ని ప్రత్యక్షంగా వ్యతిరేకించడం, ఆయన చిత్తశుద్ధి, ప్రజలతో సత్సంబంధాలు భారతీయ జనతా పార్టీకి కలిసొచ్చే అంశాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా డీఎంకే, ఏఐఏడీఎంకేలకు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారు బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Also Read : Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ కంకేర జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ 12 మంది మావోయిస్టుల హతం

Leave A Reply

Your Email Id will not be published!