YS Sharmila : అమ‌రుల త్యాగం దొర వైభోగం – ష‌ర్మిల‌

సీఎం కేసీఆర్ పై వైస్సార్టీపీ చీఫ్ ఫైర్

YS Sharmila : వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఓ వైపు నీళ్లు, నిధులు, నియామ‌కాల పేరుతో చేసిన ఉద్య‌మంలో ఎంద‌రో అమ‌రుల‌య్యార‌ని కానీ ఈనాటికీ 9 ఏళ్ల‌యినా వారికి గుర్తింపు లేకుండా పోయింద‌ని ఆవేద‌న చెందారు. గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు.

అమ‌రుల త్యాగాల వ‌ల్ల‌నే ఇవాళ కేసీఆర్ దొర వైభోగాల‌ను అనుభ‌విస్తున్నాడ‌ని ఎద్దేవా చేశారు. క‌ల్వ‌కుంట్ల కుటుంబం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌న్నారు. అసువులు బాసిన అమ‌రుల త్యాగాలు గోదారి పాల‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త్యాగాల మీద‌, వారి ర‌క్త‌పు చుక్క‌ల మీద న‌డుచుకుంటూ కేసీఆర్ వెళ్లార‌ని ఇవాళ సీఎం ప‌ద‌విని అనుభ‌విస్తున్నాడ‌ని ఆరోపించారు.

వారి ఆత్మ‌లు కేసీఆర్ చేసిన మోసాన్ని చూసి ఘోసిస్తున్నాయ‌ని వాపోయారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). గ‌త కొన్నేళ్లుగా అమరుల గురించి ఒక్క‌సారైనా మాట్లాడిన పాపాన పోలేద‌న్నారు. కానీ త్వ‌ర‌లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని ఇప్పుడు వారి జ‌పం చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఎవ‌రు క్ష‌మించినా అమ‌రుల కుటుంబాలు సీఎంను క్ష‌మించ‌వ‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. రాష్ట్ర సాధ‌న కోసం 1500 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వారి గురించి ఇప్ప‌టి వ‌ర‌కు వివ‌రాలు న‌మోదు చేయ‌లేద‌ని మండిప‌డ్డారు.

Also Read : Ponguleti Srinivas Reddy : హ‌స్తానికి పొంగులేటి జై

 

Leave A Reply

Your Email Id will not be published!