IND vs ENG 3rd ODI : ఇండియా జోర్దార్ ఇంగ్లండ్ బేజార్

రెండో వ‌న్డేలో గెలిచేది ఎవ‌రో

IND vs ENG 3rd ODI : భార‌త‌, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య కీల‌క‌మైన రెండో వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రీ షెడ్యూల్ ఐదో టెస్టులో ఘోరంగా ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి పాలైన భార‌త జ‌ట్టు ఆ త‌ర్వాత పుంజుకుంది. ఆతిథ్య జ‌ట్టుకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది.

మూడు టి20 మ్యాచ్ ల‌లో 2-1 తేడాతో సీరీస్ కైవ‌సం చేసుకుంది. మ‌రో మూడు వ‌న్డే(IND vs ENG 3rd ODI) మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా మొద‌టి వ‌న్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ కు చుక్క‌లు చూపించింది. ప్ర‌ధానంగా ఇండియ‌న్ స్టార్ పేస‌ర్ జ‌స్ ప్రీత్ బుమ్రా కొట్టిన దెబ్బ‌కు బ్యాట‌ర్లు బెంబేలెత్తి పోయారు.

కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చిన ఈ బౌల‌ర్ ఏకంగా 6 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇంగ్లండ్ ప‌త‌నాన్ని శాసించాడు. అత‌డికి తోడు ష‌మీ, ప్ర‌సిద్ద్ క్రిష్ణ కూడా తోడ‌వ‌డంతో భార‌త్ సునాయ‌సంగా గెలుపొందింది.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును 110 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది. విజ‌యం సాధించిన ఊపులో ఉంది టీమిండియా. అటు బ్యాట‌ర్లు ఇటౌ బౌల‌ర్లు అద్భుత‌మైన రీతిలో స‌త్తా చాటుతున్నారు.

రోహిత్ శ‌ర్మ , శిఖ‌ర్ ధావ‌న్ సైతం రాణిస్తుండ‌డంతో పాటు యువ ఆట‌గాళ్లు త‌మ‌దైన రీతిలో ఆడుతుండ‌డం భార‌త జ‌ట్టుకు ప్ల‌స్ పాయింట్ గా మారింది.

లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ అద్భుతం ఏమైనా చేస్తుందా అనేది చూడాలి. లేక పోతే భార‌త్ ను త‌ట్టు కోవ‌డం క‌ష్టంగా మారింది. గాయం కార‌ణంగా తొలి వ‌న్డేకు దూర‌మైన కోహ్లీ ఆడ‌తాడా లేదా అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : రాణించ‌డం కోహ్లీ చేతుల్లోనే ఉంది

Leave A Reply

Your Email Id will not be published!