Rohit Sharma : కోహ్లీపై ఎందుకీ చర్చ..రచ్చ – రోహిత్
భారత జట్టు కెప్టెన్ తీవ్ర అసహనం
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఇంగ్లండ్ టూర్ లో ఉన్న టీమిండియాను లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఏకంగా 100 పరుగుల తేడాతో ఓడించింది.
ఓటమి పాలైన అనంతరం రోహిత్ శర్మ(Rohit Sharma) మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ పర్ ఫార్మెన్స్ పై ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్నకు సీరియస్ గా స్పందించారు.
ప్రతిసారి ఎందుకు కోహ్లీ ఫామ్ గురించి ప్రస్తావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భారత జట్టుకు ఎనలేని విజయాలు అందించాడు. అన్ని ఫార్మాట్ లలో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.
వరల్డ్ వైడ్ గా తీసుకుంటే టాప్ క్రికెటర్లలో ఒకడిగా విరాట్ కోహ్లీ(Virat Kohli) ఉన్నాడు. అతడు చాలా సార్లు స్పూర్తి దాయకమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఇంతకంటే నేనేమీ చెప్ప లేనని పేర్కొన్నాడు.
ఇదే సమయంలో ప్రపంచ క్రికెట్ లో ఆడే ప్రతి క్రికెటర్ ఏదో ఒక రోజు ఫామ్ లేమితో ఇబ్బంది పడిన వారేనని గుర్తుంచు కోవాలని స్పష్టం చేశాడు.
తమకు మాత్రం విరాట్ కోహ్లీ పై పూర్తి నమ్మకంతో ఉన్నామన్నాడు. ఎలాంటి ఆందోళన, అనుమానం చెందాల్సిన అవసరం లేదన్నాడు రోహిత్ శర్మ(Rohit Sharma).
ఇదిలా ఉండగా గత కొంత కాలం నుంచీ కోహ్లీ ఒక్క సెంచరీ చేసిన పాపాన పోలేదు. మరో వైపు ఇంగ్లండ్ టూర్ లో దారుణంగా విఫలమయ్యాడు.
విండీస్ టూర్ కు అతడిని పక్కన పెట్టింది బీసీసీఐ. ఇదే సమయంలో విఫలమైన కోహ్లీని తీసేయాలని పేర్కొన్నాడు కపిల్ దేవ్.
Also Read : విరాట్ కోహ్లీపై మాజీ సెలెక్టర్ ఫైర్