KGF Director Raghuveera : త‌న‌యుడి సాయానికి ర‌ఘువీరా ఫిదా

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ భారీ విరాళం

KGF Director Raghuveera :  భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరొందారు ప్ర‌శాంత్ నీల్. ఆయ‌న పేరు చిబితే క‌ర్ణాట‌క గుర్తుకు వ‌స్తుంది. అంత‌కంటే ఎక్కువ‌గా బెంగ‌ళూరు మ‌దిలో మెదులుతుంది.

కానీ ప్ర‌శాంత్ నీల్ అనేస‌రిక‌ల్లా కేజీఎఫ్ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మరి ఈ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడికి ఏపీ లోని అనంత‌పురం జిల్లాతో ఏంటి ప‌ని అనుకుంటున్నారా.

ప్ర‌శాంత్ నీల్ స్వ‌స్థ‌లం ఎక్క‌డో కాదు ఈ క‌ర‌వు జిల్లానే. ఏపీలోని స‌త్య సాయి జిల్లా మ‌డ‌క శిర నియోజ‌క‌వ‌ర్గంలోని నీల‌కంఠాపురంలో ఏర్పాటు చేసిన ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రికి ఏకంగా రూ. 50 ల‌క్ష‌లు విరాళంగా ప్ర‌క‌టించాడు.

తన క‌న్న తండ్రి 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఈ ప్ర‌క‌ట‌న చేశాడు ప్ర‌శాంత్ నీల్. ఈ భారీ విరాళాన్ని ప్ర‌క‌టించిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు ప్ర‌ముఖ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి ఎన్. ర‌ఘువీరా రెడ్డి.

విచిత్రం ఏమిటంటే ర‌ఘు వీరా రెడ్డి సోద‌రుడు సుభాష్ రెడ్డి కొడుకే ఈ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రెడ్డి. పుట్టి పెరిగింది బెంగ‌ళూరు అయినా ఊరు మాత్రం అనంత‌పురం జిల్లా నీల‌కంఠాపురం.

కొద్ది రోజుల కింద‌టే సుభాష్ రెడ్డి కాలం చేశారు. ఇక్క‌డే ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలోనే అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. దీంతో ప్ర‌తిసారి త‌న‌కు వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా త‌న తండ్రి ఊరుకు వ‌స్తుంటాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్.

ఈ సంద‌ర్భంగా సంతోషం వ్య‌క్తం చేశారు ర‌ఘువీరారెడ్డి. నా సోద‌రుడి కొడుకు , నా త‌న‌యుడు నీల్ భారీ విరాళం ప్ర‌క‌టించినందుకు ఆనందంగా ఉంద‌న్నారు.

Also Read : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సినీ తరాల సందడి

Leave A Reply

Your Email Id will not be published!