PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తక్కువగా మాట్లాడతారు. కానీ తాను ఏం మాట్లాడాలని అనుకుంటారో దానిని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఉపయోగిస్తారు.
గత కొంత కాలం నుంచీ మోదీ ఎక్కువగా అమృత్ కాల్ అనే పదాన్ని లేదా మాటను ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు. గత 12 నెలల కాలంలో ప్రధాన మంత్రి ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక సందర్భంలో జరిగిన సమావేశాలలో అమృత్ కాల్ ను వాడుతుండడం చర్చకు దారి తీసింది.
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈ పదాన్ని ఎక్కువగా వాడడం మొదలు పెట్టారు మోదీ(PM Modi) . అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగుర వేసిన తర్వాత చేసిన ప్రసంగంలో అమృత్ కాల్ ను ఎక్కువగా వాడడం విస్తు పోయేలా చేసింది.
అమృత్ కాల్ అంటే నవ భారత దేశం అని అర్థం వచ్చేటట్టుగా మాట్లాడారు ప్రధాని(PM Modi) . ఈ పదాన్ని ఏకంగా 14 సార్లు ఉపయోగించారు. విచిత్రం ఏమిటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
ఆర్మీ భర్తీకి సంబంధించి తీసుకు వచ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ సమయంలో కూడా అమృత్ కాల్ ను ఎక్కువగా వాడారు.
ఇదిలా ఉండగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తరచుగా కామన్ ప్రొస్పెరిటీ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. అలాగే ఇప్పుడు మోదీ వాడుతున్న అమృత్ కాల్ పై బీజేపీ వారే సమాధానం చెప్పాలి.
Also Read : కేంద్ర టెలికాం విధానం అద్భుతం – మిట్టల్