US Announce Taiwan : తైవాన్ తో అమెరికా వాణిజ్య చర్చలు
చైనా సైనిక కసరత్తులకు శ్రీకారం
US Announce Taiwan : అమెరికా స్పీకర్ నాన్సీ పెలోస్ తైవాన్ లో పర్యటించిన అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 25 ఏళ్ల తర్వాత అగ్ర రాజ్యం నుంచి ఆ భూమి మీద కాలు మోపడం మొదటిసారి.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది చైనా. ఆపై సైనిక బలగాలను మోహరించింది. సముద్రంలోకి క్షిపణులను పేల్చింది. తైవాన్ చుట్టూ మోహరించింది. చైనా ఆర్థిక ఆంక్షలు విధించింది తైవాన్ పై.
ఈ విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుండి అమెరికా సంచలన ప్రకటన చేసింది. తైవాన్ తో గురువారం వాణిజ్య చర్చలను (US Announce Taiwan) జరిపేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించింది అమెరికా.
తన సార్వభౌమాధికారాన్ని కాపాడు కోవడానికి అవసరమైతే చర్యలు తీసుకుంటామని బీజింగ్ హెచ్చరికను ప్రేరేపించింది. చైనా చీఫ్ జి జిన్ పింగ్ ప్రభుత్వం ప్రణాళికా బద్దమైన చర్చలు తైవాన్ కు విదేశీ సంబంధాలపై హక్కు లేదన్న దాని వైఖరిని ఉల్లంఘించడమేనని విమర్శించింది.
ద్వీపాన్ని దాని వాస్తవిక స్వేచ్ఛ శాశ్వతంగా చేసేందుకు ప్రయత్నించమని ప్రోత్సహించ వద్దని వాషింగ్టన్ ను హెచ్చరించింది. బీజింగ్ యుద్దానికి దారి తీస్తుందని చెప్పారు.
దీనిని చైనా గట్టిగా వ్యతిరేకిస్తుంది అని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షు జుటింగ్ స్పష్టం చేశారు. చైనా ప్రధాన ప్రయోజనాలను గౌరవించాలని సూచించింది.
ఇదిలా ఉండగా గురువారం కూడా తైవాన్ సైన్య చైనా క్షిపణి దాడికి ప్రతిస్పందనగా క్షిపణలు, ఫిరంగితో డ్రిల్ నిర్వహించింది.
తైవాన్ , చైనా అంతర్యుద్దం తర్వాత 1949ల విడి పోయాయి. అధికారిక సంబంధాలు లేవు. కానీ బిలియన్ల డాలర్ల వాణిజ్యం, పెట్టుబడితో కట్టుబడి ఉన్నాయి.
Also Read : 36 గంటల పర్యటన రూ. 38 లక్షల ఖర్చు