Rishi Sunak : లిజ్ ట్రస్ టాప్ లో ఉన్నా విక్టరీ నాదే
సంచలన ప్రకటన చేసిన రిషి సునక్
Rishi Sunak : యావత్ ప్రపంచం ఇప్పుడు యుకె ప్రధాని ఎవరు అవుతారన దానిపై ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది. ప్రధాన మంత్రి పదవి నుంచి అనూహ్యంగా బోరిస్ జాన్సన్ అనూహ్యంగా తప్పుకున్నారు.
ఈ తరుణంలో బలమైన అభ్యర్థిగా భారత సంతతి మూలాలు కలిగిన రిషి సునక్ (Rishi Sunak) నిలిచారు. మొత్తం నాలుగు రౌండ్ల పోలింగ్ మొదటి జరిగింది. ఆ నాలుగు రౌండ్లలోనూ రిషి సునక్ విజయం సాధించారు.
కానీ ప్రచారం సందర్భంగా చోటు చేసుకున్న పోల్ సర్వేలలో ఏకంగా విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రస్ ఊహించని రీతిలో రిషి సునక్ ను దాటేసింది. ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా సెప్టెంబర్ 5న లక్ష మందికి పైగా ఓటర్లు తమకు ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలనే దానిపై ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన ప్రధాన టీవీ డిబేట్ లో పాల్గొన్నారు రిషి సునక్.
ప్రచార సర్వేలో లిజ్ ట్రస్ ముందంజలో ఉండవచ్చు. కానీ నేను ఇంకా వైదొలగలేదని ముందు గుర్తుంచు కోవాలన్నారు. తాను ప్రధాని రేసులో ముందు వరుసలో ఉంటానన్న నమ్మకం తనకు ఉందన్నారు రిషి సునక్(Rishi Sunak).
తాను ఓటమిని ఒప్పుకోనని, ఎల్లప్పుడూ ముందంజలో ఉండేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు రిషి సునక్.
ఆమె పోటీలో ఉన్నా అంతిమ విజయం తనదేనని ప్రకటించారు ధీమాగా. ఇదిలా ఉండగా రిషి సనక్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
Also Read : యుఎస్ వెళ్లాలంటే 500 రోజులు ఆగాల్సిందే