BK Hariprasad : కర్ణాటక సీఎం పోస్ట్ ఖరీదు రూ. 2,500 కోట్లు
సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
BK Hariprasad : కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల తూటాలు పేలుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రూ. 2,000 కోట్లు ఇస్తే సీఎం పదవి లభిస్తుందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ మరోసారి బీజేపీని టార్గెట్ చేసింది. ఈ మేరకు కన్నడ నాట ముఖ్యమంత్రి పదవి ఖరీదు విలువ ఇప్పుడు మరింత పెరిగిందని ఆరోపించింది.
దాని వాల్యూ రూ. 2, 000 కోట్ల నుండి రూ. 2,500 కోట్లకు చేరిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా బీజేపీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప కు ప్రయారిటీ ఇచ్చింది బీజేపీ హైకమాండ్.
ఆయనకు బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చోటు కల్పించింది. మరో వైపు ప్రస్తుత సీఎం బొమ్మై బొమ్మ తుపాకిగా మారారంటూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాజాగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని దాని ధర వింటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయమన్నారు కర్ణాటక ప్రతిపక్ష నేత , కాంగ్రెస్ పార్టీకి చెందిన బీకే హరిప్రసాద్(BK Hariprasad) స్పష్టం చేశారు.
ప్రస్తుతం బీజేపీలో సీఎం కోసం గొడవ జరుగుతోంది. ఆ ఖరీదైన పదవిని దక్కించు కునేందుకు భారీగా పోటీ నెలకొందన్నారు బీకే హరి ప్రసాద్. కాగా
బొమ్మైని తొలగిస్తారనే ఆరోపణలను బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ కొట్టి పారేశారు.
Also Read : యెడ్డీ బీజేపీని రక్షిస్తారా గట్టెక్కిస్తారా