CM KCR : మోదీ అహంకారం దించ‌డం ఖాయం – కేసీఆర్

నీ ఈడీ..సీబీఐ..కి భ‌య‌ప‌డ‌న‌న్న సీఎం

CM KCR : తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ప్ర‌ధాన మంత్రిపై మ‌రోసారి నిప్పులు చెరిగారు. మునుగోడు ఉప ఎన్నిక సంద‌ర్భంగా ప్ర‌జా దీవ‌న పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను శ‌నివారం చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు కేసీఆర్(CM KCR). ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తున్న మోదీని ప్ర‌జ‌లు దించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

ఇది ప్ర‌జలు ఎన్నుకున్న ప్ర‌జా స్వామిక దేశ‌మ‌న్నార‌ను. రాచ‌రిక వ్య‌వ‌స్థ ఎంత మాత్రం కాద‌న్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చాక అన్నింటినీ అమ్ముకుంటూ పోవ‌డ‌మే త‌ప్ప మిగిల్చింది ఏమీ లేద‌న్నారు.

రైతుల‌కు సంబంధించి క‌రెంట్ మోటార్లు బిగించే ప‌నిలో ప‌డ్డారంటూ మండిప‌డ్డారు సీఎం. త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బెంగాల్ ను ప‌దే ప‌దే కూల్చుతానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఏదో ఒక రోజు మోదీ(PM Modi) అహంకారానికి త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. నీ అహంకార‌మే చివ‌ర‌కు నిన్ను గ‌ద్దె దిగి పోయేలా చేస్తుంద‌న్నారు కేసీఆర్. దేశం నుంచి బీజేపీని త‌రిమి కొడితేనే మ‌నం సుర‌క్షితంగా ఉంటామ‌ని చెప్పారు.

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల పేరుతో భ‌య పెడితే తాను భ‌య‌ప‌డేటోన్ని, జంకేటోన్ని కాన‌ని అన్నారు సీఎం. మీరు గోకినా గోక‌క పోయినా నేను మాత్రం నిన్ను గోక‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వాళ్లు, దొంగ‌లు భ‌య‌ప‌డ‌తారు ఈడీకి. నేను భ‌య‌ప‌డ‌ను. వాళ్లే వ‌చ్చి నాకు చాయ్ తాగించి వెళ‌తారంటూ ఎద్దేవా చేశారు సీఎం. ఏడాదిలో ఎన్నిక‌లు ఉండంగా ఎవ‌రి కోసం రాజీనామా చేశావో రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.

Also Read : మేం మీకంటే పెద్ద గూండాలం – బండి

Leave A Reply

Your Email Id will not be published!