Rahul Gandhi : పేరుకే ఖాదీ అంతా చైనీస్ పాలిస్ట‌రే

పీఎం మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి నిప్పులు చెరిగారు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Modi)పై. దేశం కోసం ఖాదీని వాడాలంటూ పీఎం ప్ర‌క‌టించ‌డాన్ని ఎద్దేవా చేశారు.

దేశ ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీకగా భావించే జాతీయ ప‌తాకాన్ని ఓ వ్యాపార ప‌రంగా మార్చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌ని ఆరోపించారు.

పేరుకు మాత్రం ఖాదీని వాడాలంటూ, అది దేశానికి ఓ సింబ‌ల్ అంటూ బాకాలు , భ‌జంత్రీలు చెబుతూ వ‌స్తున్న మోదీ ఆచ‌ర‌ణ‌లో పాటించ‌డం లేదంటూ మండిప‌డ్డారు.

పేరుకే ఖాదీ అని దేశ వ్యాప్తంగా చైనీస్ కు చెందిన పాలిస్ట‌రే క‌నిపిస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). అభివృద్ది చెందిన‌, స్వావ‌లంంబ‌న‌తో కూడిన భార‌త దేశం త‌న క‌ల‌ను సాధించేందుకు ఖాదీ ఒక ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని మోదీ చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

కేంద్రంలో బీజేపీ కొలువు తీరిన ఈ ఎనిమిదేళ్ల కాలంలో కేవ‌లం కొంత మంది వ్యాపారుల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకే శ్ర‌మించారంటూ ఆరోపించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ప్రోగ్రెస్ ఏమిటంటే నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌లు పెంచ‌డం, ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌డం, ద్ర‌వ్యోల్బ‌ణం , నిరుద్యోగం ఆశించిన దాని కంటే అధికంగా ఉండ‌డం ఇదీ ఆయ‌న సాధించిన ఘ‌న‌త అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.

మోదీ చెప్పే మాట‌ల‌కు చేసే చేత‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంటుంద‌న్నారు. ఆనాటి స్వాతంత్ర పోరాటంలో ఖాదీ కీల‌క‌మైన పాత్ర పోషించింద‌ని కానీ ఇవాళ దానిని కూడా క‌న‌మ‌రుగు అయ్యేలా చేస్తోంద‌న్నారు రాహుల్ గాంధీ.

Also Read : స్మృతి వాన్ ను ప్రారంభించిన మోదీ

Leave A Reply

Your Email Id will not be published!