Kohli Restaurent : ‘కిషోర్’ దా భ‌వ‌నంలో కోహ్లీ రెస్టారెంట్

త్వ‌ర‌లో ప్రారంభించేందుకు ప్లాన్

Kohli Restaurent : దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క బెట్టుకోవాల‌నే ఆలోచ‌న ఈ మ‌ధ్య కాలంలో సెలిబ్రిటీల‌కు క‌లుగుతోంది. న‌టీ న‌టుల‌తో పాటు క్రీడాకారులు కూడా వ్యాపార‌, వాణిజ్య రంగాల‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్ప‌టికే ధోనీ ఆర్గానిక్ అగ్రిక‌ల్చ‌ర్ పై ఫోక‌స్ పెట్టాడు. ఇక కోహ్లీ ప‌లు బ్రాండ్ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్. మ‌రో వైపు ప్రియాంక బిగ్ రెస్టారెంట్ తో అల‌రిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే వంద‌లాది మంది ఫుడ్ బిజినెస్ పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి ఫుడ్ కోసం జ‌నం వేచి చూసే ధోర‌ణి పెరిగింది. దీంతో గ‌తంలో నిరాద‌ర‌ణకు గురైన ఈ రంగం ఇప్పుడు కాసులు కురిపిస్తోంది.

రుచిర‌క‌ర‌మైన భోజ‌నం, టీ, టిఫిన్లు, స్నాక్స్, పానీయాల కోసం విప‌రీత‌మైన డిమాండ్ పెరిగింది. ఇదే కోవ‌లోకి చేరాడు స్టార్ క్రికెట‌ర్, ర‌న్ మెషీన్ గా పేరొందిన విరాట్ కోహ్లీ. రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు.

త్వ‌ర‌లోనే రెస్టారెంట్ ప్రారంభించ‌నున్నాడు విరాట్ కోహ్లీ(Kohli Restaurent). మ‌హారాష్ట్ర లోని ముంబైలో దీనిని స్టార్ట్ చేయ‌నున్నాడు. ఆ భ‌వ‌నం ఎవ‌రిదో కాదు త‌న అజ‌రామ‌ర‌మైన గాత్రంతో అల‌రించిన న‌ట గాయ‌క దిగ్గ‌జం కిషోర్ కుమార్ ది.

ఆయ‌న‌కు గుర్తుగా దీనిని ప్రారంభిస్తున్న‌ట్లు స‌మాచారం. కిషోర దా బంగ్లా గౌరీ కుంజ్ లో ఓ పోర్ష‌న్ ను విరుష్క దంప‌తులు ఐదు సంవ‌త్స‌రాల పాటు లీజుకు తీసుకున్నారు.

సో అటు సోష‌ల్ మీడియాలో మ‌నోడికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క ఇన్ స్టా నుంచి ల‌క్ష‌లాది రూపాయ‌లు కోహ్లికి అందుతున్నాయి.

Also Read :  హాంకాంగ్ పై ఎవ‌రైనా ఆడ‌తారు 

Leave A Reply

Your Email Id will not be published!