Virat Kohli Dhoni : ఆ విష‌యంలో ధోనీ ఒక్క‌డే స్పందించాడు

మాజీ కెప్టెన్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ కామెంట్

Virat Kohli Dhoni :  భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ , స్టార్ ప్లేయ‌ర్ ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli)  షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాను టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన స‌మ‌యంలో క్రికెట్ ప‌రంగా ఒక్క మ‌హేంద్ర సింగ్ ధోనీ మాత్ర‌మే స్పందించాడ‌ని గుర్తు చేశాడు.

మిగ‌తా ఆట‌గాళ్లు ఎవ‌రూ ఎలాంటి అభిప్రాయాల‌ను పంచు కోలేద‌ని వాపోయాడు. గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కోహ్లీ ఆసియా కప్ లో రాణించాడు.

త‌న బ్యాట్ కు ప‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో త‌న‌కు ధోనీ మాత్ర‌మే మెస్సేజ్ పంపించాడ‌ని పేర్కొన్నాడు. ఇదిలా ఉండ‌గా ఆసియా క‌ప్(Asia Cup 2022) లో ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన మూడు మ్యాచ్ ల‌లో కోహ్లీ 60 ప‌రుగుల‌తో అత్య‌ధిక స్కోర్ చేశాడు.

మొత్తం 154 ర‌న్స్ చేశాడు. చివ‌రి వ‌ర‌కు జ‌రిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. ఇదే వేదిక‌పై సెప్టెంబ‌ర్ 6న శ్రీ‌లంక‌తో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

అనంత‌రం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడారు. ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఎలాంటి వ‌త్తిళ్ల‌కు లోను కాకుండా నాయ‌క‌త్వం వ‌హించ‌డం, ఆడ‌డంలో ధోనీని(MS Dhoni) మించిన ఆట‌గాడు ఎవ‌రూ లేర‌ని కితాబు ఇచ్చాడు ర‌న్ మెషీన్(Virat Kohli Dhoni).

నా నంబ‌ర్ ఎంతో మంది ఆట‌గాళ్ల వ‌ద్ద ఉంది. ఒక ర‌కంగా నాకు మెంటార్ గా కూడా ఉన్నాడు. నా జీవితంలో మ‌రిచి పోలేని వ్య‌క్తుల‌లో ధోనీ మాత్ర‌మేనంటూ గుర్తు చేసుకున్నాడు కోహ్లీ. నాకు మొద‌టి నుంచీ ధోనీ ఓ సోద‌రుడి లాగా వెన్నంటి ఉన్నాడ‌ని పేర్కొన్నాడు.

Also Read : బౌల‌ర్ల వైఫ‌ల్యం భార‌త్ ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!