Shashi Tharoor : గూండాల స‌మూహం స్వేచ్ఛ‌ను అడ్డుకోలేదు

ఎంపీ శ‌శి థ‌రూర్ కునాల్ క‌మ్రాకు సంపూర్ణ మ‌ద్ద‌తు

Shashi Tharoor : కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌ముఖ క‌మెడియ‌న్ , స్టాండ‌ప్ షో నిర్వాహ‌కుడైన కునాల్ క‌మ్రాకు మ‌ద్ద‌తు ప‌లికారు.

క‌ళాకారుల‌కు ఈ దేశంలో స్వేచ్ఛ లేకుండా పోయింద‌న్న క‌మ్రా కామెంట్స్ తాను తాను ఏకీభ‌విస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ.

ఇదే స‌మ‌యంలో గూండాల స‌మూహం ఈ దేశంలో త‌యారైంద‌ని, వారంతా తాము ఏది చెబితే అదే చ‌ట్టం, అదే శాస‌న‌మ‌ని భావిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

భార‌త రాజ్యాంగం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రికీ భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అన్న‌ది ఉంటుంద‌ని మ‌రిచి పోయారంటూ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం కునాల్ క‌మ్రా కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈనెల 17, 18 తేదీల‌లో రెండు రోజుల పాటు హ‌ర్యానాలో కునాల్ షో నిర్వ‌హించాల్సి ఉంది. ఈ మేర‌కు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఇదే స‌మ‌యంలో హిందూ సంస్థ‌లు తీవ్ర అభ్యంత‌రం తెలిపాయి.

త‌మ దేవుళ్ల‌ను కించ ప‌రుస్తూ షోస్ కునాల్ చేస్తున్నాడ‌ని అత‌డు ఇక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టేందుకు వీలు లేదంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కునాల్ కమ్రా షోస్ ర‌ద్ద‌య్యాయి.

దీనిపై తీవ్రంగా స్పందించాడు కునాల్ క‌మ్రా. ఎవ‌రు నిజ‌మైన హిందువులో చెప్పాల‌న్నాడు. దేశ స్వాతంత్రం కోసం పాటు ప‌డిన మ‌హాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న ఆర్ఎస్ఎస్ కు చెందిన నాథూరామ్ గాడ్సే విష‌యంలో తాము త‌ప్పు చేశామ‌ని హిందూ సంస్థ‌లు ప్ర‌క‌టించాల‌ని బహిరంగ స‌వాల్ చేశాడు కునాల్ క‌మ్రా.

దీనిని పుర‌స్క‌రించుకుని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). గూండాలు కొంత మందిని బెదిరించి వాక్ స్వాతంత్రాన్ని సెన్సార్ చేయ‌గ‌లిగితే మ‌న దేశం ఏమై పోతుంద‌ని ప్ర‌శ్నించారు ఎంపీ.

Also Read : దేశం ఏకం కోస‌మే పాద‌యాత్ర – రాహుల్

Leave A Reply

Your Email Id will not be published!