Nitish Kumar : పీకేను చూసి కలత చెందలేదు – సీఎం
నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
Nitish Kumar : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకేను చూసి తాను కలత చెందలేదని స్పష్టం చేశారు నితీశ్ కుమార్(Nitish Kumar).
గత కొంత కాలం నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. గతంలో జేడీయూలో చేరారు పీకే. ఆ తర్వాత సీఎంతో పొసగక బయటకు వచ్చారు. తన వృత్తిని మరోసారి స్టార్ట్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పని చేశారు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా బీజేపీని వీడి జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తో జత కట్టడాన్ని ప్రశ్నించారు పీకే.
ఆపై రాష్ట్రంలో ఇన్నేళ్లుగా పాలన సాగిస్తున్న నితీశ్ కుమార్(Nitish Kumar) ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా మోదీకి సీఎం ఎలా గులాం అయ్యోరో ట్విట్టర్ వేదికగా ఫోటోలు కూడా షేర్ చేశాడు పీకే.
దీనిపై పెద్ద రాద్దాంతం చోటు చేసుకుంది. ఈ తరుణంలో జేడీయూకు చెందిన సీనియర్ మాజీ నాయకుడు పవన్ వర్మ ప్రశాంత్ కిషోర్ , నితీశ్ కుమార్ మధ్య దూరాన్ని తగ్గించేందుకు భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కీలక సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు. పీకేతో ఏం మాట్లాడారన్న దానిపై మీడియా అడిగిన ప్రశ్నలకు దాట వేశారు నితీశ్ కుమార్. ఆయన దీనిని సాధారణ సంభాషణగా కొట్టి పారేశారు.
ఇదిలా ఉండగా రెండేళ్ల కిందట పవన్ వర్మ, పీకే నితీశ్ తో తెగదెంపులు చేసుకున్నారు. మేం కలుసుకున్నాం. ప్రత్యేకంగా ఏమీ మాట్లాడు కోలేదన్నారు సీఎం.
ఎప్పటిలాగే సాధారణ విషయాలు చర్చించుకున్నామని చెప్పారు. పీకే గతం నుంచి తనకు తెలుసని స్పష్టం చేశారు నితీశ్ కుమార్.
Also Read : నాపై ఎలాంటి అవినీతి కేసులు లేవు – ఆజాద్