Ponniyin Selvan : ఐశ్వ‌ర్యా రాయ్ హ‌ల్ చ‌ల్

మెరిసిన అందంతో అదుర్స్

Ponniyin Selvan :  సినీ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం తీసిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్(Ponniyin Selvan) పాజిటివ్ టాక్ అందుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీకి జ‌నాద‌ర‌ణ ల‌భిస్తోంది.

పొన్నియ‌న్ సెల్వ‌న్ లో నందిని పాత్ర‌లో బాలీవుడ్ న‌టి ఐశ్వ‌ర్యా రాయ్ కీల‌క పాత్రలో జీవించింది. ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌కు ఈ చిత్రం అద్దం ప‌ట్టింది.

గ‌తంలో ఆయ‌న తీసిన చిత్రాల కంటే భిన్నంగా తీసే ప్ర‌య‌త్నం చేశారు మ‌ణిర‌త్నం. ఇప్ప‌టికే ఆయ‌న టాప్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. ఎంతో కాలంగా మ‌ణిర‌త్నం తీసిన పొన్నియిన్ సెల్వ‌న్(Ponniyin Selvan) కోసం అభిమానులు ఎదురు చూశారు. ఇక చాలా కాలం త‌ర్వాత మిల్కీ బ్యూటీ ఐశ్వ‌ర్యా రాయ్ న‌టించ‌డం విశేషం. దీంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి.

చిత్రాన్ని మ‌ణిర‌త్నం అత్యంత రిచ్ గా తీసేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. ఆయ‌న శ్ర‌మ ప్ర‌తి ఫ్రేములో క‌నిపిస్తుంది. విడుద‌లైన ఈ సినిమాను ఆద‌రించ‌డం, ప్ర‌శంస‌లు కురిపించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు మించి చిత్రాన్ని తీసిన‌ట్లు పేర్కొన్నారు అభిమానులు. ఇక తొలి షో సూప‌ర్ అన్న టాక్ వ‌చ్చింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇక చాలా కాలం త‌ర్వాత అద్భుత‌మైన నందిని పాత్ర‌లో మ‌రోసారి న‌టించి మెప్పించింది అద్భుత సౌంద‌ర్య రాశిగా పేరొందిన ఐశ్వ‌ర్య రాయ్ బ‌చ్చ‌న్. క‌ళ్లే కాదు న‌ట‌న‌తో కూడా ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచేసింది. నందిని పాత్ర‌ను ఎప్ప‌టికీ గుర్తుంచుకునేలా తీర్చిదిద్దిన ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంను ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Also Read : వ‌ర్షాల దెబ్బ‌కు ఏపీ..తెలంగాణ విల‌విల

Leave A Reply

Your Email Id will not be published!