RSS Comment : దత్తాత్రేయ విమర్శ భగవత్ ప్రశంస
ఆర్ఎస్ఎస్ లో కామెంట్స్ కలకలం
RSS Comment : దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి చెప్పాల్సిన పని లేదు. భారతీయ జనతా పార్టీకి పునాది రాళ్లను వేసింది ఈ సంస్థే. కాషాయ సంస్థల్లో కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తోంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది.
గతంలో ఎన్నడూ లేనంతగా కులాలు, మతాలు, ప్రాంతాలతో కూడిన విభేదాలు , ఘర్షణలు, కేసులు పెరిగాయి. అంతే కాదు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసేలా ఇన్నేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం రేటు తీవ్రం కావడం ఆందోళన కలిగిస్తోంది.
బీజేపీలో కీలకంగా ఉన్న మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్, ఎంపీ వరుణ్ గాంధీ నిత్యం విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన సమయంలో రైతులకు గవర్నర్, ఎంపీ మద్దతు పలికారు బహిరంగంగా. ఇదే
సమయంలో గుజరాత్ లోని గోద్రా ఘటనలో సామూహిక రేప్ కు గురైన బిల్కిస్ బానో రేప్(Bilkis Bano) కేసులో యావజ్జీవ ఖైదీలను విడుదల చేయడం,
కర్ణాటకలో హిజాబ్ వివాదం, బీజేపీకి చెందిన ప్రతినిధి నూపుర్ శర్మ, విశ్వ హిందూ పరిషత్ కు చెందిన నేతలపై కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ తరుణంలో ముస్లింలు తమను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నారంటూ ఆందోళనలు చేపట్టడం చర్చకు దారితీసింది. ప్రధానంగా ప్రశ్నించే వారిని టార్గెట్ చేయడం , కేసులు పెట్టడం, అరెస్ట్ లు చేయడం కలకలం రేపుతోంది.
ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా ప్రస్తుత సర్కార్ ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక బీజేపీకి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ఆర్ఎస్ఎస్(RSS) బాధ్యులు మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబాలే రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వంలో నిరుద్యోగం, పేదరికం తీవ్ర ప్రభావం చూపుతోందంటూ దత్తాత్రేయ పేర్కొనడం కలకలం రేపింది. ఇదే సమయంలో ఆయన విమర్శిస్తే ప్రభుత్వానికి బాసటగా ఉంటూ వచ్చారు మోహన్ భగవత్.
ఆర్ఎస్ఎస్ గేమ్ ప్లాన్ లో భాగంగా ఇలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద సంకేతాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో ప్రశంసలతో ముంచెత్తారు మోహన్ భగవత్. ఒకే సంస్థకు చెందిన ఇద్దరు అగ్ర నాయకులు విరుద్ద ప్రకటనలు చేయడం విస్తు పోయేలా చేసింది.
ముందస్తుగా రాబోయే ఎన్నికల్లో ఇప్పటి నుంచే మోదీని సన్నద్దం చేయడంలో భాగంగానే దత్తాత్రేయ పేదరికం, నిరుద్యోగిత
అంశాలను లేవనెత్తారని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా మోదీ ప్రభుత్వం సమస్యల సుడిగుండంలో కొట్టు మిట్టాడుతున్న తరుణంలో వాటిని దారి మళ్లించడంలో హోసబాలే దిట్ట. ఇదంతా ముందస్తు వ్యూహంలో భాగమేనని చెప్పక తప్పదు.
మోదీ పైకి ప్రధానమంత్రి అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ చేసే తీర్మానాలను కూడా పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. ఏది ఏమైనా
రాజ్ పథ్ (రాజ భవనం ) లో ప్రధాని కొలువు తీరినా ఆర్ఎస్ఎస్ ను కాదని ముందుకు వెళ్లలేరన్నది వాస్తవం. మరి అఖండ భారతం
సిద్దిస్తుందా అన్నది వేచి చూడాలి.
Also Read : మెక్సికోలో కాల్పుల మోత 18 మంది హతం