Anurag Thakur : గుజ‌రాత్ లో బీజేపీకి ఢోకా లేదు – ఠాకూర్

గ‌త చ‌రిత్ర‌ను తిర‌గ రాస్తుందని కామెంట్

Anurag Thakur : కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో గుజ‌రాత్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఆయ‌న ఆదివారం విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఢోకా లేద‌న్నారు. త‌మ‌ను అడ్డుకునే శ‌క్తి అటు ఆప్ కి కానీ ఇటు కాంగ్రెస్ కు లేద‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని త‌మ పార్టీని ఢీకొనాలంటే ద‌మ్ముండాల‌న్నారు. అంత‌టి సీన్ ఆ రెండు పార్టీల‌కే కాదు ఎవ‌రికీ లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఆయా పార్టీలు రెండో స్థానం కోసం పోటీ ప‌డాలే త‌ప్పా త‌మ‌తో కాద‌న్నారు. 2024లో జ‌ర‌గ‌బోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 400కు పైగా సీట్లు గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు.

మోదీ సార‌థ్యంలో తాము మ‌ళ్లీ ప‌వ‌ర్ లోకి వ‌స్తామ‌ని చెప్పారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఇందులో ఎలాంటి అనుమానం లేద‌న్నారు. తాను ఇవాళ ఛాలెంజ్ చేసి చెబుతున్నా రాసి పెట్టుకోండి అంటూ స‌వాల్ విసిరారు.

ఇక గుజ‌రాత్ లో గ‌త 27 ఏళ్లుగా నిరాంటంకంగా కొన‌సాగుతోంది త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో పాల‌న‌. ప్ర‌జ‌ల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం వ‌ల్ల‌నే త‌మ‌కు ప‌ట్టం క‌డుతున్నారంటూ స్ప‌ష్టం చేశారు అనురాగ్ ఠాకూర్.

ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న ఆప్ చీఫ్ కేజ్రీవాల్ కు గుజ‌రాత్ లో అంత సీన్ లేద‌న్నారు. ఈసారి గ‌తంలో సాధించిన రికార్డుల‌ను తిర‌గ రాస్తామ‌న్నారు. గుజ‌రాత్ లోని వ‌ల్సాద్ జిల్లాలోని మ‌ల్వాన్ గ్రామంలో బీజేపీ చేప‌ట్టిన గౌర‌వ్ యాత్ర‌లో ఆయ‌న పాల్గొన్నారు.

Also Read : సిసోడియా రేపు అరెస్ట్ కావ‌చ్చు – కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!