Madhya Pradesh CM : క‌రోనా బాధిత పిల్ల‌ల‌తో సీఎం దీపోత్స‌వ్

అశోక్ గెహ్లాట్ దారిలో మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం

Madhya Pradesh CM : రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లాట్ ను అనుస‌రించారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ చౌహాన్. నిన్న క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయిన బాధితుల పిల్ల‌ల‌తో గ‌డిపారు అశోక్ గెహ్లాట్. దీనిని ఇవాళ దీపావ‌ళి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని సీఎం శివ‌రాజ్ చౌహాన్ త‌న స‌తీమ‌ణితో క‌లిసి క‌రోనా బాధితుల పిల్ల‌లతో గ‌డిపారు.

వారితో క‌లిసి దీపాల‌ను వెలిగించారు. అశోక్ గెహ్లాట్ త‌న నివాసంలో దీనిని చేప‌ట్టారు. దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారారు కాంగ్రెస్ సీఎం. కోవిడ్ బాధిత పిల్ల‌ల‌తో గ‌డ‌పడం మంచి నిర్ణ‌య‌మ‌ని , ఈ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. దీంతో దీనిని మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం కూడా పిల్ల‌ల‌తో గ‌డ‌ప‌డం విస్తు పోయేలా చేసింది.

ఏది ఏమైనా ఈ ర‌కంగానైనా పిల్ల‌ల్లో సంతోషం క‌ల‌గ‌డం మేలంటున్నారు స్థానికులు. తాజాగా మ‌ధ్య ప్ర‌దేశ్ సీఎం(Madhya Pradesh CM) పిల్ల‌ల‌తో గ‌డుపుతున్న ఫోటోలు, వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సీఎం పిల్ల‌ల‌తో పాట‌లు పాడారు. డ్యాన్సులు చేస్తూ క‌నిపించారు. ఆయ‌నతో పాటు భార్య కూడా ఈ దీపోత్స‌వ్ లో పాల్గొన్నారు.

పిల్ల‌ల‌కు స్వీట్లు, దుస్తులు అంద‌జేశారు. పిల్ల‌ల‌తో క‌లిసి దీపావళి పండుగ‌ను జ‌రుపు కోవ‌డం సంతోషంగా ఉంద‌ని పేర్కొన్నారు సీఎం శివ‌రాజ్ చౌహ‌న్. ఈ కార్య‌క్ర‌మం మ‌ధ్య ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధాని భోపాల్ లో జ‌రిగింది.

Also Read : రాజీవ్ గాంధీ ఫౌండేష‌న్ కు కేంద్రం షాక్

Leave A Reply

Your Email Id will not be published!