KTR : ఆ ఇద్ద‌రికి అంత సీన్ లేదు – కేటీఆర్

ద‌మ్ముంటే బండి..ర‌ఘు మ‌ళ్లీ గెల‌వాలి

KTR : మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్‌, ఎంపీ బండి సంజ‌య్ , దుబ్బాక ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావుపై సీరియ‌స్ అయ్యారు. ఆ ఇద్ద‌రికీ అంత సీన్ లేదన్నారు.

ద‌మ్ముంటే ఆ ఇద్ద‌రు రాజీనామా చేసి గెల‌వాల‌ని స‌వాల్ విసిరారు. పొద్దస్త‌మానం త‌మ పార్టీని విమ‌ర్శించ‌డం అల‌వాటుగా మారింద‌ని ఎద్దేవా చేశారు. జైలుకు పంపుతామంటూ ప‌దే ప‌దే మాట్లాడితే జ‌నం న‌మ్మ‌ర‌న్నారు. నోరు తెరిస్తే కూలుస్తామ‌ని అంటున్నార‌ని తెలంగాణ మరాఠా కాద‌న్నారు.

తాము ఎవ‌రినీ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR). రాష్ట్రంలో టీఆర్ఎస్ బ‌లంగా ఉంద‌న్నారు. బండికి మెద‌డు దొబ్బింద‌ని, ర‌ఘునంద‌న్ రావు ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు కేటీఆర్.

బీజేపీ ఏం చేసిందో వీళ్లు చెప్ప‌గ‌ల‌రా అని స‌వాల్ విసిరారు. ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రో వైపు నిరుద్యోగం పెరిగి పోతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు బాధ్య‌త క‌లిగిన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ మౌనంగా ఉండ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

దగా కోరు మాట‌లు త‌ప్ప భ‌య పెట్ట‌డం త‌ప్ప గ‌త ఎనిమిది సంవ‌త్స‌రాల‌లో ప్ర‌ధాని చేసిందేమీ లేద‌న్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌లో భారీ మెజారిటీతో గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. భార‌తీయ జ‌న‌తా పార్టీతో కొంద‌రు ఎమ్మెల్యేలు, మంత్రులు ట‌చ్ లో ఉన్నార‌ని చెప్ప‌డం స్ట్రాట‌జీలో భాగ‌మేన‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి రాష్ట్ర ప‌రంగా ఎలాంటి విజ‌న్ లేద‌న్నారు మంత్రి కేటీఆర్.

Also Read : ట్ర‌బుల్ షూట‌ర్ వ‌ర్సెస్ టార్చ్ బేర‌ర్

Leave A Reply

Your Email Id will not be published!