Etala Rajender : ఓట‌ర్ల‌కు టీఆర్ఎస్ డ‌బ్బుల‌తో ఎర – రాజేంద‌ర్

మునుగోడులో బీజేపీ విజ‌యం ఖాయం

Etala Rajender : మునుగోడు ఉప ఎన్నిక‌లో ఎన్ని కోట్లు ఖ‌ర్చు చేసినా అంతిమ విజ‌యం భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్(Etala Rajender) . ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో విస్తృతంగా పాల్గొన్న ఈట‌ల ప్ర‌ధానంగా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఓట‌ర్ల‌కు టీఆర్ఎస్ డ‌బ్బుల‌తో ఎర వేస్తోందంటూ ధ్వ‌జ‌మెత్తారు.

మునుగోడులో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ సాగుతోంద‌న్నారు. ధ‌ర్మానికి అధ‌ర్మానికి మ‌ధ్య జ‌రుగుతున్న య‌ద్దంగా ఈట‌ల రాజేంద‌ర్ అభివ‌ర్ణించారు. రాష్ట్రంలో పాల‌న ప‌డ‌కేసింద‌న్నారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు మునుగోడులో తిష్ట వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ఎన్ని డబ్బులు వెద‌జ‌ల్లినా ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని, అధికార పార్టీ సాగిస్తున్న అధికార దుర్వినియోగాన్ని గుర్తించార‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టే సంస్కృతి తెలంగాణ చ‌రిత్ర‌లో లేనే లేద‌ని కానీ ఎప్పుడైతే సీఎంగా కేసీఆర్ పెంచి పోషిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. బీజేపీకి పెరుగుతున్న ఆద‌ర‌ణ‌ను చూసి ఓర్వ లేక పోతున్నార‌ని మండిప‌డ్డారు.

ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు టీఆర్ఎస్ అడ్డ‌దారులు తొక్కుతోంద‌న్నారు. కోట్ల‌ను నీళ్ల లాగా ఖ‌ర్చు చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు రాజేంద‌ర్. మ‌ద్యం, డ‌బ్బుల‌తో ప్ర‌భావం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఒక్క రాజ‌గోపాల్ రెడ్డిని ఓడించేందుకు మొత్తం క్యాబినెట్ అంతా కొలువు తీరింద‌ని మండిప‌డ్డారు. సీఎం కేసీఆర్(CM KCR) ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా గెలిచేది బీజేపీ జెండానేన‌ని పేర్కొన్నారు.

Also Read : ఆ ఇద్ద‌రికి అంత సీన్ లేదు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!