Mallikarjun Kharge : అరుదైన చిత్రాన్ని పంచుకున్న ‘ఖర్గే’
ఏఐసీసీ చీఫ్ గా కొలువు తీరిన మల్లికార్జున్
Mallikarjun Kharge : కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అరుదైన ఫోటోను పంచుకున్నారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) తనయుడు ప్రియాంక్ ఖర్గే. ఆయన ప్రస్తుతం కర్ణాటక లోని చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.
గతంలో రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మల్లికార్జున్ ఖర్గే తనయుడు ఐటీ, పర్యాటక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా తన తండ్రి 137 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన పార్టీకి చీఫ్ గా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు.
ఖర్గే పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పోటీలో నిలిచిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా హాజరయ్యారు. అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అరుదైన ఫోటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా చిన్నారుల నుంచి పెద్దల దాకా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.
ఒక సాధారణ కార్యకర్త నుండి , దేశాన్ని ప్రభావితం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎదగడం మామూలు విషయం కాదని పేర్కొన్నారు ప్రియాంక్ ఖర్గే.
Also Read : అమ్మా నిన్ను చూసి గర్విస్తున్నా – రాహుల్