Vivek Agnihotri : రూ.18 కోట్లతో ‘వివేక్’ ఫ్లాట్ కొనుగోలు
కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
Vivek Agnihotri : కాశ్మీర్ ఫైల్స్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు దర్శకుడు వివేక్ అగ్ని హొత్రి. ఆయన భార్య పల్లవి జోషి కూడా పాపులర్. తాజాగా ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. కారణం ఏమిటంటే సినిమా పరంగా కాదు. ఏకంగా రూ. 18 కోట్ల రూపాయల విలువైన అపార్ట్ మెంట్ ను ముంబైలో కొనుగోలు చేశారు.
ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. కాగా మోర్బీ బ్రిడ్జి వంతెన కూలిన ఘటనలో 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 171 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై కూడా ఏమైనా వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) సినిమా తీస్తారా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
కాగా వివేక్ , పల్లవి జోషి కొన్న అపార్ట్ మెంట్ వెర్సోవా లో ఉంది. ఇది 30వ అంతస్తులో ఉండడం విశేషం. ఇక ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. దీనికి ప్రధాన మంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణులన్నీ బ్రహ్మరథం పట్టాయి.
కానీ ఇప్పటి వరకు కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. ఓ వైపు ప్రశంసలు కురిస్తే మరో వైపు విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి ఈ చిత్రంపై. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే ఏకంగా నిప్పులు చెరిగాడు. ఇది మూవీ కాదని డాక్యుమెంటరీగా కొట్టి పారేశాడు.
పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వత్తాసు పలికే సినీ రంగానికి చెందిన వారిలో కంగనా రనౌత్ తర్వాత వివేక్ అగ్ని హోత్రి ఒకరు.
Also Read : ఒక్కటైన మిస్ అర్జెంటీనా..వాలెంటిన్