IND vs ZIM T20 World Cup : భారత్ భళా జింబాబ్వే విలవిల
71 పరుగుల తేడాతో విజయం
IND vs ZIM T20 World Cup : టి20 వరల్డ్ కప్ -2022లో సెమీ ఫైనల్ కు నేరుగా దూసుకు వెళ్లింది భారత జట్టు. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్ లో జింబాబ్వేపై టీమిండియా జయకేతనం ఎగుర వేసింది. 71 రన్స్ తేడాతో గెలుపొందింది. మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన భారత్ దుమ్ము రేపింది. భారీ స్కోర్ సాధించింది.
ప్రత్యర్థి జట్టు ముందు 187 పరుగులు ముందుంచింది. ఇక బరిలోకి దిగిన జింబాబ్వే గట్టి పోటీని ఇవ్వలేక చేతులెత్తేసింది. 115 పరుగులకే చాప చుట్టేసింది. భారత బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో ఆధిపత్యాన్ని ప్రదర్శించి సత్తా చాటారు(IND vs ZIM T20 World Cup). ఇప్పటికే సెమీస్ కన్ ఫర్మ్ కావడంతో పట్టుదలతో ఆడింది టీమిండియా.
ఈ విజయంతో గ్రూప్ -బిలో ఈ గెలుపుతో భారత్ టాప్ లో నిలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 9 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆరు వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. ఇక ఆ జట్టులో బర్ల్ 35 రన్స్ చేస్తే సికిందర్ రజా మరోసారి సత్తా చాటాడు. 34 రన్స్ చేసి పరువు పోకుండా కాపాడాడు. ఈ ఇద్దరే పర్వాలేదని అనిపించారు జట్టులో.
ఇక ఆఖరున క్రెయిగ్ 11 రన్స్ చేస్తే విలియమ్స్ మరో 11 జోడించాడు. కానీ మిగతా వాళ్లు ఎవరూ భారత బౌలర్లను ధాటిగా ఆడలేక పోయారు.
అంతకు ముందు భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 రన్స్ చేసింది. ఓపెనర్ రోహిత్ నిరాశ పరిచినా స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ దంచి కొట్టాడు. 25 బంతుల్లోనే 61 రన్స్ చేసి చుక్కలు చూపించాడు.
కేఎల్ రాహుల్ మరోసారి హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ 26 పరుగులు చేయడంతో భారీ స్కోర్ సాధించింది.
Also Read : బంగ్లాకు షాక్ సెమీస్ చేరిన పాక్