Shashi Tharoor : భార‌త్ ఓట‌మి గురించి ప‌ట్టించు కోవ‌ద్దు

టీమిండియా ఘోర ప‌రాజ‌యంపై కామెంట్స్

Shashi Tharoor : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor)  సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న క్రికెట్ ప్రేమికుడు. ఇవాళ ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో చావు దెబ్బ తింది ఇండియా జ‌ట్టు. ఏకంగా ఒక్క వికెట్ కోల్పోకుండా ఇంగ్లండ్ భార‌త బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు.

169 ప‌రుగుల భారీ స్కోర్ ను అవ‌లీల‌గా ఛేదించారు. ఒక ర‌కంగా చుక్క‌లు చూపించారు. ఇంగ్లండ్ జ‌ట్టు కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్, ఓపెన‌ర్ హేల్స్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. సిక్స‌ర్లు, ఫోర్లు కొడుతూ వుంటే చేష్ట‌లుడిగి పోయారు భార‌త క్రికెట‌ర్లు.

ఎలాగైనా స‌రే భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంటుంద‌ని భావించారు అంతా. కానీ ఊహించ‌ని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు ఇంగ్లండ్ బ్యాట‌ర్లు. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ నీయాంశంగా మారింది.

ఈ త‌రుణంలో కాంగ్రెస్ ఎంపీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భారత జ‌ట్టుపై. భార‌త జ‌ట్టు(Team India) ఓడి పోయినా ప‌ట్టించు కోవ‌ద్దంటూ పేర్కొన్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. గెలుపు ఓట‌ములు క్రీడ‌ల్లో భాగ‌మేన‌ని, ఇవాళ భార‌త్ క‌నిపించ‌క పోవ‌డాన్ని తాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోన‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం శ‌శి థ‌రూర్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పోరాడిన భార‌త జ‌ట్టుకు అంత‌కంటే అద్భుత‌మైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిన ఇంగ్లండ్ జ‌ట్టుకు నేను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నానంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు.

Also Read : భార‌త్ ప‌రాజ‌యం రోహిత్ భావోద్వేగం

Leave A Reply

Your Email Id will not be published!