Rohit Sharma Cries : భార‌త్ ప‌రాజ‌యం రోహిత్ భావోద్వేగం

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ ..వైర‌ల్

Rohit Sharma Cries : ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ సెమీ ఫైన‌ల్ లో ఇంగ్లండ్ చేతిలో భార‌త జ‌ట్టు ఘోరంగా ఓట‌మి పాలైంది. ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా చేతులెత్తేసింది. భార‌త్ జ‌ట్టు నిర్దేశించిన 169 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అవ‌లీల‌గా ఛేధించింది ఇంగ్లండ్. ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ చెప్పి మ‌రీ చిత‌క్కొట్టాడు.

ఓపెన‌ర్ హేల్స్ తో క‌లిసి భార‌త బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాడు. ఒక‌టా రెండా ఏకంగా సిక్స‌ర్లు, ఫోర్ల మోత మోగించారు బ‌ట్ల‌ర్, హేల్స్ . ఈ త‌రుణంలో ఇప్ప‌టికే ఫైన‌ల్ కు చేరుకుంది దాయాది పాకిస్తాన్. అంతా భార‌త జ‌ట్టు ఫైన‌ల్ కు చేరుకుంటంద‌ని భావించారు. కానీ ఊహించ‌ని రీతిలో భార‌త జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చల్లారు జోస్ బ‌ట్ల‌ర్ , హేల్స్ .

భార‌త జ‌ట్టు ఓడి పోయిన త‌ర్వాత లాన్స్ లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కంట త‌డి పెట్టాడు(Rohit Sharma Cries). త‌న సార‌థ్యంలో ఏకంగా క‌ప్పు గెలుపొందాల‌ని ఆశించాడు. కానీ దెబ్బ కొట్ట‌డంతో తేరుకోలేక పోయింది టీమిండియా. ఇప్ప‌టికే మాజీ ఆట‌గాళ్లు ఇంగ్లండ్ ను త‌క్కువ అంచ‌నా వేయొద్ద‌ని ముందు నుంచీ హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు.

ఈ త‌రుణంలో ఏడుస్తున్న రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌కు వ‌చ్చి ఓదార్చాడు హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్. మెగా టోర్నీలో అద్భుతమైన ఆట తీరును ప్ర‌ద‌ర్శించిన భార‌త జ‌ట్టు ఉన్న‌ట్టుండి ఇంగ్లండ్ చేతిలో ప‌రాభ‌వాన్ని జీర్ణించుకోలేక పోతోంది. ఇక అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

Also Read : చెప్పారు ఇండియాను చిత‌క్కొట్టారు

Leave A Reply

Your Email Id will not be published!