Kanika Tekriwal Reddy : ఎవ‌రీ క‌నికా ఏమిటా క‌థ

లిక్క‌ర్ స్కాంలో రోజుకో ట్విస్ట్

Kanika Tekriwal Reddy : ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తీగ లాగితే డొంకంతా క‌దులుతోంది. దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా సీబీఐకి ఆప్ స‌ర్కార్ తీసుకున్న మ‌ద్యం పాల‌సీపై విచార‌ణ‌కు ఆదేశించ‌డంతో గుట్టు ర‌ట్టు అయ్యింది.

ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం , మ‌ద్యం శాఖ‌ను నిర్వ‌హిస్తున్న మ‌నీష్ సిసోడియా నివాసంలో సోదాలు చేప‌ట్టింది. మ‌ద్యం పాల‌సీ స్కాంకు సంబంధించి 15 మందిపై అభియోగాలు మోపింది. ఎమ్మెల్సీ క‌వితకు అనుచ‌రుడిగా పేరొందిన బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావుతో పాటు విజ‌య్ నాయ‌ర్ ను అదుపులోకి తీసుకుంది.

ఆపై ఊహించ‌ని రీతిలో వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి అల్లుడి సోద‌రుడు శ‌ర‌త్ చంద్రా రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ శ‌ర‌త్ చంద్రా రెడ్డి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ అర‌బిందో తో పాటు 12 కంపెనీల‌లో డైరెక్ట‌ర్ గా ఉన్నారు. తాగా ఇదే కేసుకు సంబంధించి కొత్త పేరు వెలుగులోకి వ‌చ్చింది.

అదేమిటంటే క‌నికా టేక్రివాల్ రెడ్డి(Kanika Tekriwal Reddy). ఆమె ఎవ‌రో కాదు ఈ శ‌ర‌త్ చంద్రా రెడ్డికి భార్య‌. ఆమెకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయ‌కుల‌తో పాటు ఢిల్లీలోని కొంద‌రి పెద్ద‌ల‌తో స‌త్ సంబంధాలు ఉన్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆమెకు జెట్ సెట్ గో పేరుతో ప్రైవేట్ చార్ట‌ర్డ్ విమానాలు అద్దెకు ఇచ్చే కంపెనీ ఉంది.

ఈ విమానాల‌ను డ‌బ్బున్న మారాజులు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఇందులో ప్ర‌యాణం చేస్తున్న‌ట్లు టాక్. ఈడీ, సీబీఐ ఏవియేష‌న్ అధికారుల‌కు మొత్తం లిస్టు ఇవ్వాల‌ని ఆదేశించ‌డంతో ఈమె వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈమెకు చెందిన ఫ్లైట్ల‌లోనే న‌గ‌దును ఢిల్లీకి బ‌దిలీ చేసిన‌ట్లు ఈడీ అనుమానిస్తోంది.

అదాస్ డిస్ట‌ల‌రీస్ సొమ్ముతోనే శ‌ర‌త్ చంద్రా రెడ్డి ఈఎండీ క‌ట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ కేసులో కొంత మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంకా తెలియాల్సిన స‌మాచారం చాలా ఉంది.

ఏపీ, తెలంగాణ‌తో పాటు ఢిల్లీకి సంబంధించిన రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు ఇంకా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

Also Read : ఏపీ మ‌ద్యం బాబుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!