Riya Sen Rahul Gandhi : రాహుల్ యాత్ర‌లో పాల్గొన్న రియా సేన్

యాత్రలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంది

Riya Sen Rahul Gandhi : దేశం ఐక్య‌త కోసం రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న చేప‌ట్టిన యాత్ర త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర రాష్ట్రంలో కొన‌సాగుతోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా రాహుల్ పాద‌యాత్ర‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తారు.

ప్ర‌ధానంగా సినీ రంగానికి చెందిన న‌టులు కూడా మ‌ద్ద‌తు తెలిపారు. ఇప్ప‌టికే పూన‌మ్ కౌర్ రాహుల్ గాంధీని తెలంగాణ‌లో జ‌రిగిన పాద‌యాత్ర సంద‌ర్భంగా క‌లిశారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు పోరాడాల‌ని కోరారు. ఈ మేర‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన యాత్ర‌లో రాహుల్ గాంధీ వెంట న‌డిచారు ప్ర‌ముఖ న‌టి, ద‌ర్శ‌కురాలు పూజా భ‌ట్. ఆమె అత్యంత ఆనంద దాయ‌క‌మైన సంతోషాన్ని తాను పొందాన‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టి రియా సేన్ (Riya Sen) రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు.

రాహుల్ కు బాస‌ట‌గా నిలిచారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు రియా సేన్. ఈ దేశంలోని ప్ర‌జ‌ల‌ను ఏక‌తాటి పైకి తీసుకు వ‌చ్చేందుకు రాహుల్ జీ చేస్తున్న ఈ యాత్ర‌లో పాల్గొనడం గ‌ర్వంగా ఉంద‌న్నారు. అంత‌కు మించి ఆనందం క‌లుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

గురువారం మ‌హారాష్ట్ర లోని అకోలా జిల్లాలో జ‌రిగిన భార‌త్ జోడో యాత్ర‌లో రాహుల్ గాంధీతో క‌లిసి న‌డిచారు రియా సేన్.

Also Read : ఆంగ్లేయుల‌కు సాయం చేసిన సావ‌ర్క‌ర్

Leave A Reply

Your Email Id will not be published!