CM Bommai : క‌న్న‌డ నాట కాషాయానికి ఢోకా లేదు – బొమ్మై

రాబోయే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌థ్యం

CM Bommai : క‌ర్ణాట‌క సీఎం బ‌స్వ‌రాజ్ బొమ్మై షాకింగ్ కామెంట్స్ చేశారు. క‌న్న‌డ నాట కాషాయానికి ఢోకా లేదన్నారు. తమ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జ‌లు సానుకూలంగా ఉన్నార‌ని చెప్పారు. ఆదివారం సీఎం మీడియాతో మాట్లాడారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని రేపింది. ఎన్నిక‌ల కోసం బీజేపీ రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఎన్నిక‌ల‌కు ముందు తాము త‌మ ప‌నితీరుతో ప్ర‌జ‌ల ముందుకు వెళుతున్నామ‌ని సీఎం చెప్పారు. పెద్ద ఎత్తున్న అన్ని వ‌ర్గాల వారు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని పేర్కొన్నారు. అక్టోబ‌ర్ లో రాయ‌చూరు నుంచి బీజేపీ జ‌న సంక‌ల్ప యాత్ర ప్రారంభించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు అధికార పార్టీకి రంగం సిద్దం చేస్తూ వ‌స్తున్నారు బ‌స్వరాజ్ బొమ్మై(CM Bommai) .

జ‌న సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి అపూర్వ‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే క‌ళ్యాణ క‌ర్ణాట‌క‌, కిట్టుటు క‌ర్ణాట‌క ప్రాంతాల‌ను క‌వ‌ర్ చేసింద‌న్నారు. డిసెంబ‌ర్ లోగా రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లో జ‌న‌సంక‌ల్ప యాత్ర‌ను ముమ్మ‌రం చేస్తామ‌ని పేర్కొన్నారు సీఎం.

ఇత‌ర ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌నను ముమ్మ‌రం చేస్తామ‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర వేస్తున్నామ‌ని , వారిలో విశ్వాసాన్ని నింపుతున్నామ‌ని అన్నారు. జ‌న సంక‌ల్ప యాత్ర‌లో త‌మ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు బాగున్నాయ‌ని పేర్కొన్నారు బ‌స్వ‌రాజ్ బొమ్మై(CM Bommai).

డిసెంబ‌ర్ 25 లోపు రాష్ట్ర వ్యాప్తంగా 52 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేసేందుకు ప్లాన్ చేసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా వ‌చ్చే ఏడాది 2023 ప్ర‌థ‌మార్థంలో క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Also Read : అంకుర కంపెనీకి అరుదైన పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!