Prakash Raj Modi Vote : ఫోటో ఫ‌స్ట్ ఓటు నెక్ట్స్ – ప్ర‌కాశ్ రాజ్

కెమెరా ఫ‌స్ట్ అంటూ ట్వీట్ వైర‌ల్

Prakash Raj Modi Vote : ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ధిక్కార స్వ‌రం వినిపించ‌డంలో అంద‌రికంటే ముందుంటారు. ఆయ‌న ప్ర‌శ్నించ‌డాన్ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తారు. క‌ళాకారుల ప‌క్షాన ఉంటారు..ఏమి జ‌రిగినా వెంట‌నే స్పందిస్తారు. విస్తృత అధ్య‌య‌నంతో పాటు నిక్క‌చ్చిగా మాట్లాడ‌తార‌న్న పేరు కూడా ఉంది.

ఆయ‌న గ‌త కొంత కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీని, మ‌తం పేరుతో హిందూత్వ సంస్థ‌లు, బీజేపీ చేస్తున్న రాజ‌కీయాల‌ను నిల‌దీస్తున్నారు . ఒక ర‌కంగా క‌డిగి పారేస్తున్నారు. ప్ర‌కాశ్ రాజ్(Prakash Raj Modi Vote) కంటిన్యూగా ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని టార్గెట్ చేశారు.

తాజాగా ఆయ‌న మోదీకి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఏది ఏమైనా ప్ర‌చారంపై ఉన్న శ్ర‌ద్ద‌, ఆస‌క్తి, కోరిక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌ధాన‌మంత్రికి లేకుండా పోయింద‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఫోటోను షేర్ చేశారు. ఆయ‌న మోదీ ఓటు వేస్తూనే ఫోటోకు ఫోజు ఇచ్చారంటూ పేర్కొన్నారు.

ఇందుకు సంబంధించి క్యాప్ష‌న్ కూడా జ‌త ప‌ర్చారు. కెమెరా ఫ‌స్ట్ ఓటు నెక్ట్స్ అంటూ ఎద్దేవా చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ప్ర‌కాశ్ రాజ్ చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై హిందూ, బీజేపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నారు. కావాల‌ని ఇలా టార్గెట్ చేయ‌డం మంచిది కాదంటున్నారు మ‌రికొంద‌రు.

ఏది ఏమైనా ప్ర‌కాశ్ రాజ్ ఏది చేసినా లేదా ఏది మాట్లాడినా అది సంచ‌ల‌నంగా మార‌డం మాత్రం ష‌రా మామూలే. మ‌రి ఈ న‌టుడు చేసిన ట్వీట్ కు మోదీ ఏం స‌మాధానం చెబుతార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Also Read : అయ్యో ‘బాల’ ‘సూర్య’ ఎందుకిలా

Leave A Reply

Your Email Id will not be published!