Ravindra Jadeja Rivaba : హ‌లో ఎమ్మెల్యే ‘రివాబా’ కంగ్రాట్స్

53, 000కు పైగా ఓట్ల తేడాతో గెలుపు

Ravindra Jadeja Rivaba : గుజ‌రాత్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రోసారి స‌త్తా చాటింది. భారీ సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా జ‌డేజా(Ravindra Jadeja Rivaba) ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 53,000ల‌కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ర‌వీంద్ర జ‌డేజా.

హ‌లో ఎమ్మెల్యే నీవు ఆ ప‌ద‌వికి అర్హురాలివంటూ పేర్కొన్నారు. జామ్ న‌గ‌ర్ నార్త్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా రివాబా జ‌డేజా పోటీ చేశారు. ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన క‌ర్ష‌న్ భాయ్ పై ఘ‌న విజ‌యాన్ని సాధించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో త‌న భార్య గెలుపొంద‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు జ‌డేజా.

అంతే కాదు సంబురాల్లో మునిగి పోయారు. భార్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. జామ్ న‌గ‌ర్ నార్త్ నుంచి 57 శాతానికి పైగా ఓట్ల శాతం పొందారు. ఈ మేర‌కు ర‌వీంద్ర జ‌డేజా త‌న భార్య గెలుపు గురించి శుక్ర‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఇందులో భాగంగా ఫోటో కూడా జ‌త ప‌ర్చారు.

ఈ ఫోటోకు ఓ క్యాప్ష‌న్ కూడా జ‌త‌ప‌ర్చారు. ఎమ్మెల్యే గుజ‌రాత్ అని రాసి ఉన్న చిన్న ప్ల కార్డ్ ను కూడా షేర్ చేశాడు ర‌వీంద్ర జ‌డేజా. రివాబాకు 88,835 ఓట్లు రాగా క‌ర్ష‌న్ భాయ్ కు 35,265 ఓట్లు వ‌చ్చాయి. జామ్ న‌గ‌ర్ ప్ర‌జ‌లంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా త‌న భార్య రివాబా గెలుపు కోసం విస్తృతంగా ప్ర‌చారం చేశాడు ర‌వీంద్ర జ‌డేజా. మొద‌టి ద‌శ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు గుజ‌రాత్ లో ప‌ర్య‌టించిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని క‌లిశారు.

Also Read : 2 వేల కంటే త‌క్కువ ఓట్ల‌తో 15 సీట్లు

Leave A Reply

Your Email Id will not be published!