Dr Vaishali Reddy Parents : న‌వీన్ రెడ్డి దారుణం పెళ్లి అబ‌ద్దం

వైశాలి రెడ్డి పేరెంట్స్ షాకింగ్ కామెంట్స్

Dr Vaishali Reddy Parents : దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ డాక్ట‌ర్ వైశాలి కిడ్నాప్ వ్య‌వ‌హారం. డాక్ట‌ర్ వైశాలి రెడ్డిని కిడ్నాప్ చేయ‌డం, సినిమా ఫ‌క్కీలో ఏకంగా 75 మందికి పైగా దాడి ఘ‌ట‌న‌లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఇంట్లోకి వెళ్లారు. చింద‌ర వంద‌ర‌గా వ‌స్తువుల‌ను ప‌డేశారు.

ఆపై వైశాలి రెడ్డి పేరెంట్స్ పై దాడికి దిగారు. అంతే కాకుండా డాక్ట‌ర్ కోర్సు చ‌దువుతున్న వైశాలి రెడ్డిని ఎత్తుకు వెళ్లారు. అడ్డుకోబోయిన వారిపై దాడి చేశారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన వాహ‌నాల‌ను ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల‌ను ధ్వంసం చేశారు. త‌న కూతురును బ‌ల‌వంతంగా ఎత్తుకు వెళ్లిన దానిపై పేరెంట్స్(Dr Vaishali Reddy Parents)  దామోద‌ర్ రెడ్డితో భార్య ఆరోపించారు.

ఆపై వారికి గాయాలు కూడా అయ్యాయి. త‌న బిడ్డ‌ను కాపాడాల‌ని కోరుతూ ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద ఎత్తున సంచ‌ల‌నం రేపింది ఇరు తెలుగు రాష్ట్రాల‌లో, దేశ వ్యాప్తంగా. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేజ్ చేశారు. ఆపై న‌ల్ల‌గొండ జిల్లా నుంచి విజ‌య‌వాడ‌కు పారి పోతుండ‌గా న‌వీన్ రెడ్డిని ప‌ట్టుకున్నారు.

అత‌డితో పాటు 16 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా ఈ ఘ‌ట‌న‌లో దాడికి పాల్ప‌డిన వారు ఇంకా ఎందురున్నార‌నే దానిపై ఆరా తీస్తున్నారు. ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. తాను వైశాలి రెడ్డిని పెళ్లి చేసుకున్నాన‌ని , ఇందుకు సంబంధించిన ఫోటోలు త‌న వ‌ద్ద ఉన్నాయ‌ని ఆరోపించాడు న‌వీన్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా పెళ్లి చేసుకున్నాడ‌నేది అబ‌ద్ద‌మ‌ని, అత‌డు పూర్తిగా సైకోగా మారాడ‌ని, ఇబ్బందుల‌కు గురి చేశాడ‌ని ఆరోపించారు వైశాలి రెడ్డి పేరెంట్స్.

Also Read : మ‌లుపు తిరుగుతున్న వైశాలి కిడ్నాప్ కేసు

Leave A Reply

Your Email Id will not be published!