Anand Patwardhan : రాహుల్ యాత్ర‌లో ఆనంద్ ప‌ట్వ‌ర్ధన్

రాజ‌స్థాన్ లో కొన‌సాగుతున్న యాత్ర

Anand Patwardhan : భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో మోస్ట్ పాపుల‌ర్ ద‌ర్శ‌కుడిగా పేరొందారు ఆనంద్ ప‌ట్వ‌ర్ధ‌న్. ఆయ‌న తీసే సినిమాలు స‌మాజాన్ని ప్ర‌తిబింబించేలా ఉంటాయి. భిన్న‌మైన అభిప్రాయాల‌కు వేదిక‌గా పేరొందాయి త‌ను తీసిన సినిమాలు. ఆనంద్ ప‌ట్వ‌ర్ద‌న్(Anand Patwardhan) ఉన్న‌ట్టుండి హాట్ టాపిక్ గా మారారు.

కార‌ణం ఫిల్మ్ మేక‌ర్ ఉన్న‌ట్టుండి కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన్నారు. ఇప్ప‌టికే ప‌లువురు సినీ రంగానికి చెందిన వారు పాలు పంచుకున్నారు. ఈ దేశానికి ద్వేషం కాదు కావాల్సింది ప్రేమ అన్న నినాదంతో భార‌త్ జోడో యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

సినీ న‌టుల‌తో పాటు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు రాహుల్ తో జ‌త క‌ట్టారు. అంతే కాదు భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌, రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ సైతం భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన‌డం విశేషం. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాధాన్య‌త సంత‌రించుకునేలా చేసింది.

ఆయ‌నతో రాహుల్ గాంధీ సంభాషించ‌డం , ప‌లు ప్ర‌శ్న‌ల‌కు సావ‌ధానంగా మాజీ గ‌వ‌ర్న‌ర్ చెప్ప‌డం విస్తు పోయేలా చేసింది. ఈ దేశానికి ఏం కావాల‌నే దానిపై రాజ‌న్ ఇచ్చిన స‌మాధానాలు ఇప్పుడు పాఠాలుగా మారాయి.

ఈ త‌రుణంలో ఫిల్మ్ మేక‌ర్ ఆనంద్ ప‌ట్వ‌ర్ద‌న్ రాహుల్ గాంధీతో జ‌త క‌ట్ట‌డం ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది. ఆయ‌న బాట‌లో మ‌రికొంద‌రు ప్ర‌ముఖులు యాత్ర‌లో చేరే అవకాశం ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Also Read : రాహుల్ పై రాథోడ్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!