Amruta Fadnavis Modi : ఈ దేశానికి న‌రేంద్ర మోదీ దిక్సూచి

దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృతా

Amruta Fadnavis Modi : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృతా ఫ‌డ్న‌వీస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ఈ మ‌ధ్య నిత్యం వార్త‌ల్లో ఉంటూ వ‌స్తున్నారు. ఒక ర‌కంగా హాట్ టాపిక్ గా మారారు. ఇంకోవైపు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు. ఇటీవ‌ల అమృతా ఫ‌డ్న‌వీస్ నిర్వ‌హించిన మ‌హిళా కార్యక్ర‌మంలో యోగా గురు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారానికి దారి తీశాయి.

మ‌హిళ‌లు చీర‌ల్లో అందంగా ఉంటారు..లేక పోయినా చాలా అందంగా ఉంటారంటూ కామెంట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇదే స‌మ‌యంలో మ‌హిళ‌లను కించ ప‌రుస్తూ రాం దేవ్ బాబా మాట్లాడుతున్నా అమృతా ఫ‌డ్న‌వీస్(Amruta Fadnavis) అభ్యంత‌రం చెప్ప‌లేదు. దీనిపై మ‌హిళా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌వాదులు తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

తాజాగా మ‌రో సంచ‌ల‌న కామెంట్స్ చేశారు అమృతా ఫ‌డ్న‌వీస్. ఈ దేశానికి ఇద్ద‌రే పితామ‌హులు ఉన్నార‌ని ఒక‌రు ఆనాటి దేశానికి మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ అయితే నేటి భార‌తానికి న‌రేంద్ర మోదీ పితామ‌హుడు అంటూ కితాబు ఇచ్చారు. దీనిపై పెద్ద రాద్దాంతం కొన‌సాగుతోంది.

నాగ్ పూర్ ర‌చ‌యిత‌ల సంఘం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అమృతా ఫ‌డ్న‌వీస్(Amruta Fadnavis) ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌తిపక్షాలు ఆమెను టార్గెట్ చేశాయి. దేశాన్ని బ‌డా బాబుల‌కు దోచి పెడుతూ , ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్న మోదీ ఎలా పితామ‌హుడు అవుతాడంటూ ప్ర‌శ్నిస్తున్నాయి.

ఆమె గ‌తంలో కూడా పితామ‌హుడు మోదీకి పుట్టిన‌రోజు అభినంద‌న‌లు అంటూ ట్వీట్ చేయ‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది.

Also Read : డ్ర‌గ్స్..టెర్ర‌రిజం ప్ర‌మాదం – అమిత్ షా

Leave A Reply

Your Email Id will not be published!