BCCI India Squad : భార‌త జ‌ట్టు ఎంపిక‌పై ఉత్కంఠ

ఉండేదెవ‌రో ఊడేది ఎవ‌రో

BCCI India Squad : శ్రీ‌లంక టూర్ లో ప‌ర్య‌టించేందుకు భార‌త జ‌ట్టుకు కొద్ది స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే కోట్లాది ఆదాయం క‌లిగిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనుస‌రిస్తున్న తీరు, ఎంపిక చేస్తున్న విధానం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియా వేదిక‌గా నిప్పులు చెరుగుతున్నారు అభిమానులు, మాజీ క్రికెట‌ర్లు.

బంగ్లా టూర్ లో వ‌న్డే సీరీస్ ను కోల్పోయింది. కానీ టెస్టు సీరీస్ చేజిక్కించుకుంది. తాజాగా జ‌న‌వ‌రి 3 నుంచి శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది టీమిండియా. ఇప్ప‌టి దాకా బీసీసీఐ జ‌ట్ల‌ను(BCCI India Squad) ఎంపిక చేయ‌లేదు. న్యూజిలాండ్ టూర్ లో పాండ్యా సార‌థ్యంలో చివ‌ర‌గా టీ20 సీరీస్ ఆడింది. మ‌రో వైపు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ ను ప‌క్క‌న పెట్ట‌డంపై పెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ త‌రుణంలో శ్రీ‌లంక టూర్ లోనైనా ఎంపిక చేసే జ‌ట్ల‌లో చోటు క‌ల్పిస్తారా లేదా అన్న‌ది అనుమానంగా ఉంది. ఇక టీ20కి వ‌న్డే జ‌ట్ల‌కు వేర్వేరు గా కెప్టెన్ల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

టీ20 టీమ్ లో పాండ్యా, గిల్, త్రిపాఠి, అయ్య‌ర్ , సూర్య కుమార్ యాద‌వ్ , ఇషాన్ కిష‌న్ , సుంద‌ర్ , సంజూ శాంస‌న్ , చాహ‌ల్ , హ‌ర్ష‌ల్ ప‌టే్ల , కుల్దీప్ యాద‌వ్ , సిరాజ్ , అర్ష దీప్ , ఉమ్రాన్ మాలిక్ ను ఎంపిక చేసే ఛాన్స్ ఉంది.

ఇక వ‌న్డే జ‌ట్టుకు సంబంధించి చూస్తే ..కుల్దీప్ యాద‌వ్ , రోహిత్ శ‌ర్మ , ధావ‌న్ , కోహ్లీ, ప‌టీదార్, అయ్య‌ర్ , త్రిపాఠి, షాబాజ్ అహ్మ‌ద్ , అక్ష‌ర్ ప‌టేల్ , సుంద‌ర్ , ఠాకూర్ , సంజూ శాంస‌న్ , ఇషాన్ కిష‌న్ , సిరాజ్ , ఠాకూర్ , శార్దూల్ ఠాకూర్ , చాహ‌ర్ , ఉమ్రాన్ మాలిక్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే అవ‌కాశం ఉంది.

Also Read : ప్ర‌భుత్వం చెబితే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడం – సేథీ

Leave A Reply

Your Email Id will not be published!